జహీరాబాద్, నవంబర్ 23: జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో ఇంటి మ్యుటేషన్కు రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి, రూ.2 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు మెదక్ రేంజీ ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపారు. బుధవారం జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకాం.. మున్సిపల్ కమిషనర్ సుభాశ్రావు దేశ్ముఖ్, మేనేజర్ మనోహర్ ఇంటి మ్యుటేషన్ కోసం రూ.3 లక్షల లంచం డిమాండ్ చేశారు. రూ.2.50 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు.
బుధవారం మున్సిపల్ కా ర్యాలయంలో రూ. 2లక్షల నగదు తీసుకుంటుండగా పట్టుకున్నారు. కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ అటెండరుగా పని చేస్తున్న రాకేశ్కు, ఇంటి యజమాని ఎండీ.నిసారుద్దీన్ రూ.2 లక్షల నగదు ఇస్తుండగా పట్టుకున్నారు. ఎండీ.నిసారుద్దీన్ మూసానగర్లో కొనుగోలు చేసిన ఇంటిని మ్యుటేషన్ చేసేందుకు దరఖాస్తు చేశాడు. ఇంటిపై అనేక ఫిర్యాదులు రావడంతో డబ్బు లు డిమాండ్ చేశారు. ఇంటి మ్యుటేషన్ కోసం తీసుకున్న రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. సుభాశ్రావు దేశ్ముఖ్, మేనేజరు మనోహర్, ఆవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాకేశ్ను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుచేయనున్నట్లు తెలిపారు. సమావేశం లో ఏసీబీ సీఐ వెంకటరాజుగౌడ్, రమేశ్ పాల్గొన్నారు.