మెదక్ అర్బన్/ టేక్మాల్/ అల్లాదుర్గం/ నర్సాపూర్/ కొల్చారం, ఏప్రిల్ 23 : కుల వ్యవస్థ, వర్ణబేధం, లింగ వివక్షతను వ్యతిరేకించిన అభ్యుదయవాది మహాత్మా బసవేశ్వరు డు అని మెదక్ డీఎస్పీ సైదులు అన్నారు. ఆదివారం మెదక్ ఎస్పీ కార్యాలయంలో బసవేశ్వర జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ డీఎస్పీ మాట్లాడుతూ.. బసవేశ్వరు డు స్ఫూర్తినీయు డని, ప్రజలను కులమతాలకతీతంగా ఏకం చేసారన్నారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ దిలీప్, ఐటీ కోర్ ఎస్సై మహిపాల్రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా బసవేశ్వర 890వ జయంతి
టేక్మాల్ మండలకేంద్రంతోపాటు బొడ్మట్పల్లి గ్రామంలో బసవేశ్వర 890వ జయంతి నిర్వహించారు. టేక్మాల్లోని వీరశైవ లింగాయత్ మఠం నుంచి భక్తుల శివప్ప, భక్తుల వీరప్ప వంశీయులు ర్యాలీ నిర్వహించి బసవేశ్వరుని విగ్రహనికి పూజలు చేశారు. అనంతరం ప్రతి ఇంటికీ బసవేశ్వరుడి జ్ఞాపిక అందజేశారు.కార్యక్రమంలో భక్తుల వీరప్ప, ఎంపీపీ స్వప్న రవి, ఎంపీటీసీ నిమ్మ వాణీరమేశ్ పాల్గొన్నారు.
అల్లాదుర్గం మండలం బహిరన్దిబ్బ, చేవెళ్ల గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ కాశీనాథ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహులు, నాయకులు చెన్నప్ప, ప్రభు పాల్గొన్నారు. నర్సాపూర్ పట్టణంలో బసవేశ్వర 890వ జ యంతి వేడుకలు వీరశైవ లింగాయత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బసవేశ్వరస్వామికి రుద్ర నమక చమకాలతో, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లను పం పిణీ చేశారు. కార్యక్రమంలో గురుస్వామి వీరప్ప, వీరశైవ లింగాయత్ సభ్యులు బస్వప్ప, సంగమేశ్వర్, వినోద్కు మార్, మల్లికార్జున్, నాగరాజు, శివకుమార్, శంకర్, రాజ శేఖర్ పాల్గొన్నారు. కొల్చారం మండలంలోని తుక్కాపూర్ లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు, విశ్వపతి, శరణ్, సిద్ధ్దప్ప, శివకుమార్ పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక చింతన, భక్తి, సన్మార్గంలో నడిచేందుకు బసవేశ్వరుడి మార్గం అనుసరణనీయమని చేనేత అభివృద్థి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని బైపాస్ రోడ్డు బసవేశ్వర చౌక్లో విగ్రహానికి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వెనకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బసవేశ్వరుని చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్, చింత ప్రభాకర్లు మాట్లాడుతూ సామాజీక సంస్కర్త మహాత్మా బసవేశ్వరుడు కుల, మతాలకు అతీతంగా చూపిన ఆధ్యాత్మిక, భక్తి, సన్మార్గం చేటికీ ఆదర్శప్రాయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బి.విజయలక్ష్మి, జిల్లా బీసీ సంక్షేమాధికారి జగదీష్, ఆర్డీవో నగేశ్, సీడీసీ కాసాల బుచ్చిరెడ్డి, నాయకులు విజయేందర్రెడ్డి, వీరశైవ లింగాయత్ జిల్లా అధ్యక్షులు మధుశేఖర్, జయ ప్రకాశ్, ఫోరమ్ ఫర్ బెటర్ అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర ఉపాధ్యక్షుడు సజ్జాద్ఖాన్, ప్రధాన కార్యదర్శి మహేశ్కుమార్, సహా కార్యదర్శులు శ్రీకాంత్, పాండురంగం, కార్యవర్గ సభ్యులు సాయి వరాల, నరేశ్కుమార్, రాము తదితరులు పాల్గొన్నారు.
జడ్పీ కార్యాలయంలో..
సర్వ మత సారామే సమాజనికి ఆదర్శమని, ప్రజలను చైతన్యపరిచిన గొప్ప వ్యక్తి బసవేశ్వరుడుని, సమాజనికి ఆయన చూపిన మార్గం ఆదర్శప్రాయంగా నిలిచిందని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నా రు. జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి బసవేశ్వరుని చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల జైపాల్రెడ్డి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిప్యూటి సీఈఓ స్వప్న, సూపరింటెండెంట్లు విఠలేశ్వర్, నర్సింహరెడ్డి, నాగేందర్, రవీందర్, రవిశంకర్, విజ్ఞాన్, రమేశ్, సులోచన, సంతోషి, అమరేందర్, సిబ్బంది పాల్గొన్నారు.
అభ్యుదయవాది ‘బసవేశ్వరుడు’
మెదక్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): మహాత్మా బసవేశ్వరుడి జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బసవేశ్వరుడి 890వ జయంతి సందర్భంగా అదనపు కలెక్టర్ రమేశ్, అధికారులు, లింగాయత్ నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజ్, బీసీ అదనపు సంక్షేమ అధికారి నాగరాజ్ గౌడ్, లింగాయత్ సమాజం జిల్లా అధ్యక్షుడు మల్లప్ప, వైస్ ప్రెసిడెంట్ సంగమేశ్వర్, పీడీ ఆనందం, పట్టణ ప్రెసిడెంట్ శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ రవి, నాయకులు పాల్గొన్నారు.