తూప్రాన్/ నర్సాపూర్/ శివ్వంపేట/ కొల్చారం/ రామాయంపేట, జూలై 6 : ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా తూప్రాన్లోని ప్రాథమిక పశువైద్య కేంద్రంలో బుధవారం శునకాలకు వ్యాక్సినేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితి గా జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య మాట్లాడారు. జునొటిక్ అనగా పశువుల నుంచి మనుషులకు సోకే వ్యాధుల ని, వాటిని నివారణకు పెంపుడు జంతువులకు వ్యాక్సినేషన్ కా ర్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పశువైద్యఅధికారి లక్ష్మి, అసిస్టెంట్ డాక్టర్ లింగమూర్తి, గోపాలమి త్రలు శ్రీనివాస్, అశోక్, నాయకుడు సత్యలింగం ఉన్నారు.నర్సాపూర్ పట్టణంలోని ఏరియా పశువైద్యశాలలో పెంపుడు కుక్కలకు నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కౌన్సిలర్ లతారమేశ్యాదవ్, ఏడీ జనార్దన్రావు ప్రారంభించారు. గురువారం కూడా టీకాలు వేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పశువైద్యశాల సిబ్బంది గోవర్ధన్, ఇక్బాల్, వెంకట్ పాల్గొన్నారు.
వ్యాక్సిన్తో రేబీస్ను అరికట్టవచ్చు
కుక్కలకు వ్యాక్సిన్ ఇచ్చి, మనుషులకు రేబీస్ వ్యాధి రాకుం డా అరికట్టవచ్చని పశువైద్యాధికారి డాక్టర్ వినోద్కుమార్ అ న్నారు. శివ్వంపేటలోని ప్రాథమిక పశువైద్యకేంద్రంలో సర్పంచ్ పత్రాల శ్రీనివాస్గౌడ్ సమక్షంలో పెంపుడు కుక్కలకు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రియాంక, సిబ్బంది బాలయ్య, రమాదేవి, భాగ్యలక్ష్మి, శివ ఉన్నారు.
పెంపుడు జంతువుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని రామాయంపేట పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. పట్టణంలో పెంపుడు కుక్కలకు టీకాలు వేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు శంకర్, శ్యాములు, సుభాష్, మాజీ ఎంపీటీసీ సిద్ధిరాంరెడ్డి, ఉప సర్పంచ్ శైలజ, గోపాలమిత్ర యా దగిరి, కార్యదర్శి మహేందర్, శివకుమార్, రాజు ఉన్నారు.
కొల్చారం పశువైద్యశాలలో పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేశారు. 32 పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్ ఇచ్చి నట్లు వెటర్నరి అసిస్టెంట్ గట్టయ్య తెలిపారు. కార్యక్రమంలో కారోబార్ ప్రభాకర్, వైద్యశాల సిబ్బంది మహిపాల్ ఉన్నారు.