ఝరాసంగం మండలం బర్ధిపూర్లో పట్టా భూమి 230.14, ప్రభుత్వ భూమి 215.13 ఎకరాలు, చిలేపల్లి గ్రామంలో పట్టా భూమి 446.12 ఎకరాలు, ప్రభుత్వ భూమి 170.11 ఎకరాలు, ఎల్గొయి పట్టా భూమి 1452.04 ఎకరాలు, ప్రభుత్వ భూమి 931.26 ఎకరాలు ఉంది. న్యాల్కల్ మండలంలోని రుక్మాపూర్లో పట్టాభూమి 270.09 ఎకరాలు, ప్రభుత్వ భూమి 190.32 ఎకరాలు, ముంగి గ్రామంలో పట్టాభూమి 271.14 ఎకరాలు, ప్రభుత్వ భూమి 283.02 ఎకరాల భూమి సేకరిస్తున్నారు.
న్యాల్కల్ మండలం గణేశ్పూర్లో పట్టాభూమి 433.00 ఎకరాలు, ప్రభుత్వ భూమి 188.13 ఎకరాలు, హుస్సెల్లి పట్టా భూమి 594.13 ఎకరాలు, ప్రభుత్వ భూమి 137.35 ఎకరాలు, గుంజోటిలో పట్టాభూమి 291.33 ఎకరాలు, హద్నూర్లో పట్టాభూమి 512.31 ఎకరాలు ప్రభుత్వ భూమి 77.38 ఎకరాలు, న్యాతాబాద్ పట్టాభూమి 768.03 ఎకరాలు, ప్రభుత్వ భూమి 448.01 ఎకరాలు, మామిడ్గి పట్టాభూమి 1214.31 ఎకరాలు, ప్రభుత్వ భూమి 235.16 ఎకరాలు, కల్బేమాల్ పట్టాభూమి 171.16 ఎకరాలు, ప్రభుత్వ భూమి 244.00 ఎకరాలు, బసంత్పూర్ పట్టాభూమి 132.24 ఎకరాలు, ప్రభుత్వభూమి 90.04 ఎకరాలు, మెటల్కుంట పట్టాభూమి 318.10 ఎకరాలు, ప్రభుత్వ భూమి 376.30 ఎకరాలు, గంగ్వార్లో పట్టాభూమి 38.17 ఎకరాలు, రేజింతల్లో పట్టాభూమి 1481.14 ఎకరాలు, ప్రభుత్వ భూమి 232.09 ఎకరాలు, మల్కాన్పహాడ్లో 145.39 ఎకరాలు, ప్రభుత్వ భూమి 85.33 ఎకరాలు సేకరిస్తున్నారు.
జహీరాబాద్కు ఉత్తరాన 9 కిలోమీటర్ల దూరంలో నిమ్జ్ ఏర్పాటవుతున్నది. కర్ణాటకలోని బీదర్కు ఆగ్నేయంగా 8 కి.మీ దూరంలో ఉంటుంది. నిమ్జ్ వెంట ఎస్హెచ్-14, ఎస్హెచ్-16 రహదారులు ఉన్నాయి. మహారాష్ట్ర కూడా దగ్గరలోనే ఉంటుంది. వీటితో పాటు 65వ జాతీయ రహదారి (పుణే- మచిలీలీట్నం రోడ్డు) 10 కి.మీ దూరంలో ఉంది. మెటల్కుంట రైల్వేస్టేషన్ 1.4 కి.మీ దూరంలో ఉంటుంది.
ఆటోమొబైల్ , లోహాలు, విద్యుతు యంత్ర సామగ్రి, యంత్ర పరికరాలు( మిషీనరీ), ఆహార ప్రాసెసింగ్, లోహ-యేతర ఖనిజాలు, రవాణా పరికరాలు, వినియోగాలు, వసతి సౌకర్యాలు కలిపించే వాటిని ఏర్పాటు చేస్తున్నారు. కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికా సిద్ధం చేసింది. ఇప్పటికే నిమ్జ్లో వెమ్ టెక్నాలజీస్, ట్రైటాన్ ఎలక్ట్రిక్, లైట్ ఆటో మోటివ్ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. దిగ్గజ కంపెనీల రాకతో ఆటోమొబైల్ హబ్గా జహీరాబాద్కు ప్రపంచంలో గుర్తింపు లభించనున్నది. కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) ఫండ్ ద్వారా ఈ ప్రాంతంలో మహిళలు, బాలికలు, యువతకు వివిధ రంగాలు, అంశాల్లో శిక్షణ ఇస్తారు. విద్య, ఉద్యోగ శిక్షణ, మౌలిక వసతుల కల్పనకు చేయూతనిస్తారు. రైతులు పంటల దిగుబడి పెంచేందుకు శిక్షణ, అవగాహన కల్పిస్తారు. బిందు సౌర విద్యుతు ఉత్పత్తికి సౌకర్యాలు కలిపిస్తారు. రోడ్ల నిర్మాణంతో పాటు రేడియం రోడ్స్ అభివృద్ధి చేస్తారు.
నిమ్జ్లో పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రాంతంలో ముం గితండా, చంద్రానాయక్ తండా, సూర్యనాయక్తండా, (రుక్మాపూర్ తండా), చీలేపల్లి తండాలు ఉన్నాయి. ఈ తండాలను తొలిగించకుండా గ్రామస్తులకు పునరావాసం కలిపించేందుకు బృహత్ ప్రణాళిక ఏర్పాటు చేశారు. తండాల పరిసరాల్లో నివాస ప్రదేశాలు,సామాజిక మౌలిక సదుపాయాలు హరిత ప్రదేశాలు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశారు. నిమ్జ్లో భూములు కోల్పోయిన రైతుల పిల్లలకు ఉపాధి కలిపించేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కుటుంబానికి ఉపాధి కలిపించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్థానికులకు ఉపాధి కలిపించేందుకు అధికారులు యువకులకు అక్కడే శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
నిమ్జ్ కోసం భూసేకరణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. మార్కెట్లో భూముల ధరలు పెరిగిపోవడంతో ప్రభుత్వం పట్టా, ప్రభుత్వ భూమికి ఎకరానికి రూ.15 లక్షలు చెల్లించేందుకు ఆదేశాలు జారీచేసింది. మొదటి విడుతలో బర్ధిపూర్, ఎల్గొయి, చిలేపల్లి, న్యాల్కల్ మండలంలోని ముంగి, రుక్మాపూర్ గ్రామాల్లో 3534.17 ఎకరాలకు 3100 ఎకరాలు సేకరించాం. మిగిలిన 434.17 ఎకరాలు సేకరిస్తున్నాం. నిమ్జ్కు ప్రత్యేక రోడ్డు నిర్మాణానికి 65వ జాతీయ రహదారి హుగ్గెల్లి చౌరస్తా నుంచి బర్థిపూర్-ఎల్గొయి శివారు వరకు 65 ఎకరాల భూమి సేకరిస్తున్నాం. నిమ్జ్లో భూములు కోల్పోయిన రైతుల పిల్లలకు ఉద్యోగాలు కలిపించేందుకు ప్రభుత్వం నైపుణ్య శిక్షణ కలిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. రెండో విడతలో 8వేల ఎకరాల భూమి సేకరిస్తాం. రైతులు భూములు ఇస్తామని ముందుకు వచ్చి నిమ్జ్ ప్రాజెక్టు కార్యాలయంలో ఒప్పంద పత్రాలు రాసి ఇస్తున్నారు. వారికి డబ్బులు చెల్లించేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నాం.
-రమేశ్బాబు, ఆర్డీవో(నిమ్జ్ ప్రత్యేకాధికారి) జహీరాబాద్