అల్లాదుర్గం, జూన్27: రైతులు పండించిన అన్ని పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం అల్లాదుర్గంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వరి పంటకు బదులు ఇతర పంటలను వేయాలని సూచించడంతో ఇక్కడి రైతులు జొన్న పంటను ఎక్కువగా వేశారన్నారు. దీంతో జొన్న దిగుబడి పెరగడంతో రైతులు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరడంతో నేడు ప్రారంభించమన్నారు. కేంద్ర ప్రభుత్వం పట్టించుకో కున్న రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వెచ్చించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పా టు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పండించిన పంటను విక్రయించాలన్నారు. రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తారన్నారు. కార్యక్రమంలో వట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రజినీకాంత్, టీఏసీ మెంబర్ కాశీనాథ్, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, మండల అధ్యక్షుడు పల్లెగడ్డ నర్సింహులు, సర్పంచు అంజియాదవ్, ఎంపీటీసీ దశరథ్, ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం
మండలలో పీఏసీఎస్లో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్యెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ దళారులకు తక్కువ ధరకు జొన్నలను విక్రయించకుండా కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులకు భరోసా కల్పించిన ప్రభుత్వం టీఆర్ ఎస్ మాత్రమే అన్నారు. తహసీల్దార్ లక్షణ్, ఏవో జావీద్, పీఏసీఎస్ చైర్మన్ భాస్కర్రాజు, మండల అధ్యక్షుడు బుచ్చ య్య, ప్రధాన కార్యదర్శి రమేశ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు సిబ్బంది పాల్గొన్నారు.