రామాయంపేట, నవంబర్7: పురపాలిక వార్డుల్లో సమస్యల్లేకుండా తీర్చడమే తన లక్ష్యమని పురపాలిక చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ అన్నారు. సోమవారం రామాయంపేట పురపాలికలో వార్డులో వారం రోజుల పర్యటనలో భాగంగా ఆరో వార్డులోని సమస్యలను వార్డు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తేవాలని వార్డు ప్రజలను, వార్డు కౌన్సిలర్ దేమె యాదగిరిని కోరా రు. ముఖ్యంగా వార్డులో నీటి సమస్య, విద్యుత్ ఇతర సమస్యలు ఉన్నా తనకు చెప్పాలన్నారు. వార్డులో మురికి కాల్వ లు, రోడ్లు నిర్మించాలని చైర్మన్ దృష్టికి తెచ్చారు. వెంటనే అక్కడికే సంబంధిత ఏఈని పిలిపించుకుని ఈ సమస్యను ఏఈకి తెలిపారు.
ఒక్కో వార్డుకు వారం రోజుల పాటు సమ యం తీసుకుంటామని పట్టణంలోని 12వార్డులకు రెండు వార్డులు నేటితో పూర్తి అయ్యాయని తెలిపారు. ఇంకా 10 వారాల పాటు ప్రతి గల్లీ తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు. సీఎం కేసీఆర్ మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి నాయకత్వంలో పట్టణాన్ని అన్ని విధాల సుందరీకరిస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, సిబ్బందితో పాటు కౌన్సిలర్లు దేమె యాదగిరి నాయకులు చంద్రపు కొండల్రెడ్డి, దేవుని రాజు, సిబ్బంది శ్రీనివా స్, ప్రసాద్, సురేశ్ ఉన్నారు.