రామాయంపేట, అక్టోబర్ 31: రామాయంపేట మున్సిపల్లో వార్డులో సమస్యల్లేకుండా తీర్చడమే తన లక్ష్యమని పురపాలిక చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ అన్నారు. సోమవారం రామాయంపేట పురపాలికలో వార్డులో వారం రోజుల పర్యటనలో భాగంగా మొదటి వార్డులోని సమస్యలను వార్డు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తేవాలని వార్డు ప్రజలను, వార్డు కౌన్సిలర్ను కోరారు. ముఖ్యంగా వార్డులో నీటి సమస్య, విద్యుత్ సమస్యలు ఉన్నా తనకు చెప్పాలన్నారు.
వార్డులో విద్యుత్ సమస్యలు ఉన్నాయని ముఖ్యంగా స్తంభాలకు విద్యుత్ లైట్లు వెలగడం లేదని చైర్మన్ దృష్టికి తేవడంతో వెంటనే అక్కడికే సంబంధిత ఏఈ పెంట్యా నా యక్ను పిలిపించుకుని విద్యుత్ సమస్యపై ఏఈకి వివరించారు. ఒక్కో వార్డుకు వారం రోజుల పాటు సమయం తీసుకుంటామని పట్టణంలోని 12 వార్డుల కు గాను 12వారాల పాటు ప్రతి గల్లీ తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి నాయకత్వంలో పట్టణాన్ని అన్ని రంగాల్లో సుం దరీకరిస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి, వైస్ చైర్పర్సన్ పుట్టి విజయలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, సిబ్బందితో పాటు కౌన్సిలర్లు దేమె యాదగిరి, అనిల్కుమార్, చిలుక గంగాధర్, నాయకులు దేవుని రాజు, చింతల యాదగిరి ఉన్నారు.