కంది, జూలై 13 : డ్రమ్ సీడర్ సాగుతో ఖర్చు, సమయం ఆదా చేసుకోవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. దిగుబడి కూడా అధికంగా వస్తుందని పేర్కొంటున్నారు. కలుపు నివారణ కూడా సులభంగా చేసుకోవచ్చని అంటున్నారు. అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో దిగుబడి వస్తుందని చెబుతున్నారు. రైతులకు ఇది ఆర్థికంగా ఎంతో మేలు చేస్తుందంటున్నారు. ఈ పద్ధతి వరి సాగు విధానాన్ని కంది మండలం కలివేముల గ్రామంలో వ్యవసాయ అధికారులు ఏడీఏ మనోహర, ఏవో చైతన్య సోమవారం ప్రారంభించారు. సర్పంచ్ బక్కి బంధమ్మ మొగులయ్య దంపతులు తమ ఎకరా భూమిలో కొత్తగా కొన్న డ్రమ్ సీడర్ ద్వారా లాంఛనంగా ఈ పద్ధతికి స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరూ ఈ పద్ధతి ద్వారా వరి సాగు చేస్తే ఎన్నో లాభాలు కలగడంతో పాటు కూలీల కొరత, తక్కువ సమయంలో మంచి దిగుబడి పొందవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
డ్రమ్ సీడర్ వరి సాగు ఇలా…
డ్రమ్ సీడర్ కావాలనుకున్న రైతులు రూ.5700 వెచ్చించి ఈ పరికరాన్ని కొనవచ్చు. ఈ డ్రమ్ సీడర్లో మొత్తం 4 డ్రమ్లుంటాయి. ప్రతీ డ్రమ్కు రెండు వైపు చివరన విత్తనాలు కింద పడేలా రంధ్రాలుంటాయి. ఈ రంధ్రాలు ఒకటి విడిచి మరొకటి మూసి ఉంటాయి. దీనిని సాగు భూమిలో లాగేందుకు ముందు ఒక పుల్లర్ కూడా ఉంటుంది. తక్కువ బరువుతో ఉం డే ఈ డ్రమ్ సీడర్ను ఒక రైతు సులువుగా లాగి విత్తనాలు విత్తునే అవకాశం ఉన్నది. దీంతో వరి సాగు చేయాలనుకున్న రైతు ముందుగా డ్రమ్ సీడర్లో వేసే విత్తనాలకు ఒక గ్రాము కార్బండీజం మందును ఒక లీటరు నీటికి కలిపిన ద్రవణంలో కిలో విత్తనాలు వేయాలి. వీటిని 12 గంటల పాటు నానబెట్టి 24 గంటలు మండె కట్టాలి. విత్తనం ముక్కు పగిలి తెల్లపూస వచ్చినాకా ఈ విత్తనాలను డ్రమ్ సీడర్లో వేసి సాగుభూమిలో విత్తుకోవాలి. 20 సెంటీమీటర్ల చొప్పు న నాలుగు వరుసలు సమాంతరంగా విత్తనాలు నేలన పడడంతో పంట బాగా పండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ముక్కు పగిలిన విత్తనా లు ప్రతి డ్రమ్లో 3/4 శాతం చొప్పున మాత్ర మే వేసుకోవాలి. అప్పుడే డ్రమ్ సీడర్ను సాగు భూమిలో తిప్పేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రింద వరసగా పడుతాయి.
డ్రమ్ సీడర్ వచ్చే సమస్యలకు చిట్కాలు..
ఈ పద్ధతిలో కలుసు సమస్య ఉంటుంది కాబట్టి, ఇందు నివారణ కోసం 5 రోజుల లోపు పైరోజ్ సల్యూరాన్, థైల్(సాథి) అనే మందును 80 గ్రాముల ఇసుకలో కానీ, నీటిలో కలిపి పిచికారీ చేసుకుం టే ఈ సమస్యను అధిగమించవచ్చు. 20-25 రోజుల లోపు బిస్పైరిబా క్స్ సోడియం (నామినీ గోల్డ్)ను 100-120 మిల్లీ లీటరు ఒక ఎకరానికి పిచికారీ చేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది.
డ్రమ్ సీడర్ ప్రయోజనాలు..
కూలీల ఖర్చు పూర్తిగా తగ్గుతుంది. 15 కేజీల విత్తనం మాత్రమే ఎకరాకు సరిపోతుంది. ఒకే మనిషి రోజుకు 3-4 ఎకరాల వరకు ఈ డ్రమ్ సీడర్ ద్వారా విత్తుకునే వెసులుబాటు ఉన్నది. అలాగే కూలీల ఖర్చుతో పాటు ఇతర ఖర్చులు తగ్గి సాధరణ సాగు కంటే డ్రమ్ సీడర్ ద్వారా ఒక ఎకరాకు రైతుకు రూ.10-12 వేలు ఖర్చు మిగిలిపోతుంది. 15 రోజుల ముందే మంచి లాభసాటి దిగుబడి రైతు చేతికు అందుతుంది.