మెదక్ మున్సిపాలిటీ, మే 10 : జిల్లాకేంద్రంలో విధించిన పాక్షిక లాక్డౌన్ సోమవారం నాటికి 13వ రోజుకు చేరింది. పట్టణంలో లాక్డౌన్ సంపూర్ణంగా కొనసాగుతున్నది. మధ్యా హ్నం 2 నుంచి ఉదయం 6 గంటల వరకు వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూసివేయడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. దవాఖానలు, మెడికల్ దుకాణాలు మాత్ర మే తెరుచుకున్నాయి. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్ర మే బయటకు రావాలని, కొవిడ్ నిబంధనలతోపాటు భౌతిక దూరం పాటించాలని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ కోరారు.
మంబోజిపల్లిలో లాక్ డౌన్..
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. మండలంలోని మం బోజిపల్లిలో వ్యాపార, వాణిజ్య సముదాయాలను ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిచి ఉంచారు.
నిజాంపేటలో పొడిగింపు..
మండలకేంద్రం నిజాంపేటలో విధిం చిన పాక్షిక లాక్డౌన్ నేటితో ముగిసింది. కాగా, కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం పంచాయతీ పాలక వర్గం సమావేశం నిర్వహించి, మరో 10 రోజులపాటు లాక్ డౌన్ను పొడిగించింది. ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని, అత్యవసరమైతే తప్పా మిగతా సమయాల్లో ఇంటికే పరి మితం కావాలని ప్రజలను సర్పంచ్ అనూష కోరారు.
లాక్డౌన్కు వ్యాపారుల సహకారం
లాక్డౌన్కు పట్టణంలోని వ్యాపా ర, వాణిజ్య వర్గాలు పూర్తిగా సహకరిస్తున్నారు. లాక్డౌన్ స మయాని కంటే గంట ముందుగానే షాపులన్నీ మూసివేశారు. పట్టణంతోపాటు గ్రామాల్లోనూ కరోనా కేసులు పెరిగిపోవడం తో లాక్డౌన్ను పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
మనోహరాబాద్లో మధ్యాహ్నం తర్వాత..
కరోనా వైరస్ నియంత్రణకు గ్రామపంచాయతీలు సెల్ఫ్ లాక్డౌన్, పరిశుభ్రతపై దృష్టి సా రించాయి. మనోహరాబాద్లో మధ్యాహ్నం నుంచి లాక్డౌన్ చేస్తూ సర్పంచ్ చిట్కుల మహిపాల్రెడ్డి అధ్యక్షతన తీర్మానం చేశారు. మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే రూ.1000 జరిమానా విధిస్తామని తెలిపారు. కోనాయిపల్లి పీటీ, గౌతోజిగూడెం గ్రామాల్లో శానిటైజేషన్ చేపట్టారు.
‘పేట’లో కొనసాగుతున్న లాక్డౌన్
మండలంలో ఈ నెల 5 నుంచి పూర్తిస్థాయి లాక్డౌన్ నిర్వహించారు. లాక్డౌన్ విధించడంతో పెద్దశంకరంపేట నాందేడ్-అకోలా 161వ జాతీయ రహదారితోపాటు పట్టణ ప్రధాన వీధులు నిర్మానుష్యంగా మారాయి.