రేగోడ్, జనవరి 19 : హత్య కేసులో నిందితు లైన సోదరులిద్దరూ గురువారం పోలీస్స్టేషన్లో లొంగిపోయారు. రేగోడ్ మండలంలోని చౌదర్పల్లి గ్రామ శివారులో ఈ నెల 16న మహిళ ను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భర్త, అతడి సోదరుడు నిందితులు. ఈ మేరకు గురువారం పోలీస్ స్టేషన్లో సీఐ జార్జి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చౌదర్పల్లికి చెందిన కూతురి కేశయ్యకు మృతురాలు లక్ష్మితో 20ఏండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు రవి, రాజు. అదే గ్రామానికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త కేశయ్య పలుమార్లు భార్య లక్ష్మితో గొడవపడి హెచ్చరించాడు. భార్య మారకపోవడంతో ఎనిమిదేండ్ల క్రితం కేశయ్య రెండో వివాహం చేసుకోవడంతో ఇద్దరు వేర్వేరు గా ఉంటున్నారు. కాగా, దీంతో మృతురాలు కమలాపూర్ గ్రామంలో ఉంటున్నది. అయితే, చౌదర్పల్లికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం ఉండడంతో ఊరికి వస్తూ పోతూ ఉన్నది.
సొంత గ్రామంలోనే వివాహేతర సంబం ధం చూడలేక కేశయ్య మొదటి భార్యను చంపాలని వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతు న్న మేనమామను చూడడానికి 16న ఆటోలో మృతురా లు తన సోదరి పోచమ్మ, తల్లి కనకమ్మతో కలిసి చౌదరి పల్లికి వచ్చారు. విషయం తెలుసుకున్న కూతురి కేశయ్య తన సోదరుడు యోహాన్ ఇద్దరు కలిసి గ్రామ శివారులో వాగు వద్ద కాపుకాశారు. తిరుగు ప్రయాణంలో ఆటోలో వస్తున్న మృతురాలు లక్ష్మిని కిందికి దింపగా సోదరి, తల్లి కూడా అక్కడే దిగారు. ఆటోడ్రైవర్ను బెదిరించగా పారిపోయాడు. వెంటనే లక్ష్మిని వెంబడించి కత్తితో నరికి చం పి, వాగులో పడేశారు. లక్ష్మిని చంపిన తర్వాత మృతు రాలి సోదరి, తల్లిని కూడా చంపడానికి ప్రయత్నించగా, ఇద్దరు తప్పించుకున్నారు. ఈ మేరకు మృతురాలి కుటుం బ సభ్యుల ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం నిందితులు స్వయంగా పోలీస్స్టేషన్కు వచ్చి లొంగిపోయినట్లు సీఐ జార్జి వివరించారు. హత్య చేశామని ఒప్పుకున్నారని, నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. సమా వేశంలో ఎస్సై సత్యనారాయణ,సిబ్బంది ఉన్నారు.