గజ్వేల్, మే 11: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కొండపోచమ్మ సాగర్, గజ్వేల్లో వెజ్నాన్ వెజ్ మార్కెట్ను గురువారం 13 మందితో కూడిన మహారాష్ట్ర బృందం సభ్యులు సందర్శించారు. గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ద్వారా మహారాష్ట్ర బృందం సభ్యులు కుల్దీప్, దీపక్, వినోద్తో పాటు ఇతర సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొండపోచమ్మ ప్రాజెక్టులోని గోదావరి జలాలను చూస్తే సంబురంగా ఉందన్నారు. మహారాష్ట్రలో పుట్టిన గోదావరి నీళ్లను తెలంగాణ ప్రాజెక్టులో చూడడం సంతోషంగా ఉందన్నారు.
మావద్ద నీటి వనరులు ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రభుత్వాలు కృషి చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. 24గంటల కరెంట్, రైతులకు ప్రాజెక్టుల ద్వారా సాగునీరందిస్తున్న కేసీఆర్ సంకల్పం గొప్పదన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడంతో ఇక్కడి రైతుల బతుకులు బాగుపడుతున్నట్లు చెప్పారు. గజ్వేల్లోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను సందర్శించిన బృందం సభ్యులు మార్కెట్లోని మాంసం, కూరగాయలు, పూలు, పండ్లు, సూపర్ మార్కెట్లను కలియతిరిగారు. మార్కెట్ నిర్మాణం బాగుందన్నారు. వారివెంట మార్కెట్ వైస్ చైర్మన్ ఉపేందర్రెడ్డి, కార్యదర్శి జాన్వెస్లీ తదితరులు ఉన్నారు.