చేర్యాల, జనవరి 5 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవానికి పోలీస్శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్రావు తెలిపారు. ఈ నెల 2న కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మల్లన్న క్షేత్రంలో పర్యటించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులు, దేవాదాయ, విద్యు త్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బందికి సూచించిన విషయం తెలిసిందే. కలెక్టర్ ఆదేశాల మేరకు అడిషన్ డీసీపీ శుక్రవారం ఆయన మల్లన్న క్షేత్రంలో పర్యటించి ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం శీఘ్రదర్శనం, స్పెషల్ దర్శనం, సాధారణ దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూ, కల్యాణ కట్ట, వీఐపీ గ్యాలరీ, జనరల్ గ్యాలరీ తదితర వాటిని పరిశీలించారు.
కల్యాణం పూర్తి అయిన తర్వాత భక్తులు స్వామి వారి వద్దకు వచ్చి అక్షింతలు వేసే సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ఏర్పాట్లు చేయించారు. వీఐపీ పార్కింగ్, జనరల్ పార్కింగ్ ప్రదేశాలను క్షేత్రస్థ్ధాయిలో పరిశీలించి భక్తులకు అసౌకర్యం లేకుం డా ఏర్పాట్లు చేయాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. క్షేత్రంలో ప్రత్యేకంగా సీసీ కెమోరాలు ఏర్పాటు చేసే పనులను పరిశీలించారు. పోలీస్ కంట్రోల్ రూమ్, కమ్యూనికేషన్ గురించి వీహెచ్ఎఫ్ సెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆయనతో జిల్లా వైద్యాధికారి కాశీనాథ్, హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, ఈవో బాలాజీ, ఏఈవో వైరాగ్యం అంజయ్య, చేర్యాల సీఐ సత్యనారాయణరెడ్డి, కొమురవెల్లి ఎస్సై నాగరాజు, మద్దూరు ఎస్సై యూనిస్ హైమద్ అలీ, వివిధశాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.