ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గులాబీ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్లు కట్ చేశారు. ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి అన్నదానం చేశారు. ఆయన వందేండ్లు చల్లగా ఉండాలని దేవాలయాల్లో పూజలు నిర్వహించారు.
దవాఖానల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి అభిమానాన్ని చాటుకున్నారు. గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి భక్తసమాజం వ్యవస్థాపకుడు రామరాజు సబ్బుపై కేసీఆర్ చిత్రం గీసి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడు.
– ఉమ్మడి మెదక్ జిల్లా నెట్వర్క్, ఫిబ్రవరి 17