మెదక్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను శనివా రం మెదక్ బీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి కేసీఆర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం జిల్లా కేంద్ర దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నేతృత్వం లో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. అభివృద్ధి, సంక్షేమాలకు చిరునామాగా నిలిపిన కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, నిండు నూరేళ్లు జీవించాలన్నారు. చరిత్రలో కేసీఆర్ పేరు నిలిచిపోతుంది.
మనోహరాబాద్, ఫిబ్రవరి 17: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వం టేరు ప్రతాప్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. కేసీఆర్ 70వ పుట్టిన రోజు సందర్భంగా మనోహరాబాద్ మండలం కూచారంలో సీఎంఆర్ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు దాసరి నరేశ్ ముదిరాజ్, స్థానిక నాయ కుడు ఉదయ్రంజన్గౌడ్ ప్రారంభించారు. బీఆర్ఎస్ నేతలు రక్తదానం చేశారు.
అనంత రం కేక్ కట్చేసి సంబురాలు నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ.. కేంద్రం, రాష్ట్రంలో కేసీఆర్ ఎన్నో పదవులు చేపట్టి, తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా పనిచేశారన్నారు. కాళేశ్వ రం ప్రాజెక్టుతో తెలంగాణను మాగాణిగా మా ర్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. రక్తదానంలో పాల్గొన్న కేసీఆర్ మనుమడు మండలంలోని కూచారంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో కేసీఆర్ సోదరి మనుమడు అరుణ్తేజ్రావు పాల్గొని రక్తదానం చేశారు.