మర్కూక్, ఫిబ్రవరి 17: గులాబీ అధినేత కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. శనివారం ఆయన దత్తత గ్రామం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆయుష్య హోమం నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మ న్ వంటేరు ప్రతాప్రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ నిండు నూరేళ్లు జీవించాలని, రాష్ర్టానికి మరిన్ని సేవలు అందించాలని భగవంతుడిని ప్రార్థించారు. దేశానికే తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. కార్యక్రమంలో బాలరాజు, భాగ్యాభిక్షపతి, ఎంపీటీసీ తుమ్మకృష్ణ, నాయకులు పాల్గొన్నారు.