సంగారెడ్డి, జనవరి 3 :స్వాతంత్య్రం రాక పూర్వమే దేశంలోని మహిళలకు అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన మహా మేధావి అక్షర సరస్వతి సావిత్రిబాయి పూలే అని టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ ఆమె సేవలను కొనియాడారు. పట్టణంలోని ప్రధాన రహదారి విద్యుత్ కార్యాలయం ముందు ఉన్న సావిత్రిబాయి విగ్రహానికి చింతా ప్రభాకర్ మంగళవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ సావిత్రిబాయి సేవలు నేటితరం ప్రజలకు ఉపయోగపడుతూ ఆదర్శంగా నిలిచాయన్నారు. ముఖ్యంగా మహిళలకు ఆరాధ్యురాలై చదువుల తల్లిగా గుర్తుండిపోయిందన్నారు. కార్యక్రమంలో వివిధ పార్టీల పట్టణ, మండల అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, నర్సింలు, చక్రపాణి, మాజీ సీడీసీ చైర్మన్ విజయేందర్రెడ్డి, మాజీ జడ్పీటీసీ మనోహర్గౌడ్, కౌన్సిలర్లు రామప్ప, విష్ణువర్ధన్, సర్పంచ్ మోహన్ సింగ్ నాయక్, నాయకులు నర్సింగ్రావు, జీవీ శ్రీనివాస్, జలేందర్రావు, అశోక్, కసిని శ్రీకాంత్, నాగరాజు, నర్సింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో…
బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం స్థానిక విద్యుత్ కార్యాలయం ఆవరణలో ఉన్న సావిత్రిబాయి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ నిమ్న వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని పోరాటం చేసి మహిళా విద్యాభివృద్ధికి కృషి చేసిన సామాజిక కార్యకర్త పూలే అని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మాణయ్య, వెంకట హరిహర కిషన్, గంజి జానకీరామ్, కుమ్మరి సాయిలు, మల్లయ్య, మొగులయ్య, పుండరీకం, మురళి, రాఘవులు, కృష్ణ యాదవ్, శ్రీధర్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో…
సావిత్రిబాయి పూలే జయంతి వేడులను ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలోని సావిత్రిబాయి విగ్రహానికి మంగళవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ అట్టడుగు వర్గాల మహిళల హక్కుల కోసం అగ్రవర్ణాలతో పోరాడిన నాయకురాలు పూలే అని గుర్తుచేశారు. ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధ్యక్షుడు సజ్జాద్ఖాన్, కార్యదర్శి మహేశ్ కుమార్, సహాయ కార్యదర్శి శ్రీకాంత్, సాయి వరాల పాల్గొన్నారు.