శివ్వంపేట, మే 27 : నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యం అని రాష్ట్ర మహిళా కమీషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పెద్దగొట్టిముక్ల గ్రామానికి చెందిన వడ్ల వెంకటేశ్కు మంజూరైనరూ. 19,500 సీఎంఆర్ఎఫ్ చెక్కును సర్పంచ్ చంద్రకళ శ్రీశైలం యాదవ్కుకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి సీఎంఆర్ఎఫ్తో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఆదర్శవంతమైన పథకాలతో తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుందన్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం తెలంగాణలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు నయీమోద్దిన్, వెంకటేశ్, గౌస్ తదితరులు ఉన్నారు.