హిమాయత్నగర్,జూన్15: ప్రమాదవశాత్తు జీవితం మధ్యలో ఏదైనా అవయవం కోల్పోయి దివ్యాంగులుగా మారిన వారు అవస్థలు పడవద్దనే సంకల్పంతో నేడు (ఆదివారం) హైదరాబాద్లోని కింగ్ కోఠిలోని ఈడెన్ గార్డెన్ ఫంక్షన్హాల్లో ఆర్టిఫిషియల్ లింబ్, కాలిఫర్స్, ఫిట్మెంట్తో పాటు ఉచితంగా కృత్రిమ అవయవాలు పంపిణీ చేస్తున్నట్లు నారాయణ్ సేవా సంస్థాన్ ట్రస్టీ డైరెక్టర్ దేవేంద్ర చౌబిసా, కో-ఆర్డినేటర్ అల్కా చౌదరి తెలిపారు.
ఆ కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్ను శనివారం హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేతులు,కాళ్లు కోల్పోయి దివ్యాంగులుగా మారి దుర్భర జీవితం గడుపుతున్న వారికి విముక్తి కల్పించాలనే ఉద్దేశంతో గత 39 ఏండ్లుగా వివిధ రాష్ర్టాల్లోని దివ్యాంగులకు ప్రయోజనం కల్పించేందుకు సంస్థ కృషి చేస్తుందన్నారు. 2024 ఫిబ్రవరి 4న 1500మందికి కొలతలు తీసుకోగా, వీరిలో 800 మందికి కృత్రిమ అవయవాలు అందజేస్తున్నామని తెలిపారు. సమావేశంలో సామాజికవేత్త రితేశ్ జగీర్దార్, సంస్థ ప్రతినిధులు ఉత్తమ్దామ్రాణి, మహేంద్రసింగ్ రావత్, జస్మిత్ పటేల్, భగవాన్ ప్రసాద్గౌర్ పాల్గొన్నారు.