అందోల్, ఫిబ్రవరి 27: అర్థరాత్రి లారీ రూపం లో దూసుకొచ్చిన మృత్యువు ముగ్గురు యువకులను బలితీసుకుంది. సరదాగా టీ తాగేందుకు వెళ్లిన స్నేహితులు కొద్దిసేపట్లో ఇండ్లకు చేరుకుంటారనగా వారు ప్రయాణిస్తున్న కారు ను లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. మండల పరిధిలోని మాసాన్పల్లి శివారుల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి జోగిపేట ఎస్సై అరుణ్కుమార్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం జోగిపేటకు చెందిన మహమ్మద్ వాజిద్(27) హాజీహుస్సేన్(25) ముకర్రం(25)తోపాటు రిజ్వా న్, శంషు, అర్షద్ టీ తాగేందుకు కారులో చౌటకూరుకు వెళ్లగా, అక్కడ దుకాణాలు మూ సి ఉండడంతో మాసన్పల్లి శివారులోని ఓ దా బాలో టీ తాగి, తిరుగుప్రయాణంలో జోగిపేటకు వస్తూ డాకూర్-మాసాన్పల్లి శివారులో అండర్ బ్రిడ్జి పక్కన కారును ఆపి మూత్ర విసర్జనకు వెళ్లారు. ఇదే సమయంలో సంగారెడ్డి వై పు నుంచి వచ్చిన లారీ (ఆయిల్ట్యాంకర్) ఆగి ఉన్న కారును వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది.
కారు ముందు మూత్రవిసర్జన చేస్తున్న వాజీద్, హాజీ హుస్సేన్, ముకర్రంపై నుంచి కారు, ఆ తర్వాత లారీ వెళ్లడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతిచెందారు. రిజ్వాన్ రెండు కాళ్లు విరిగిపోవడంతో మెరుగైన చికిత్సకోసం గాంధీకి తరలించారు. మరో ఇద్దరు యువకులు జోగిపేటలో చికిత్సపొందుతున్నారు. మృతులతోపాటు గాయపడిన యువకులు జోగిపేటలో మెకానికులుగా పనిచేస్తున్నారు. మృతుడు వాజిద్కు గతేడాది పెళ్లవగా, అతడి భార్య ప్రస్తుతం గర్భిణి. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను జోగిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించి పోస్టుమార్టం నిర్వహించి మృతుల బంధువులకు అప్పగించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. డీఎస్పీ సత్యయ్య ప్రమాద స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కాగా, ప్రమాదానికి కారణమైన గుజరాత్కి చెందిన లారీ దాదాపు 20 కిలో మీటర్లు వెళ్లిన తర్వాత మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం కాయిదంపల్లి వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ్రడ్రైవర్ సైతం మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మృతుల కుటుంబాలను మంగళవారం మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పరామర్శించారు. మృతుడు వాజిద్ బీఆర్ఎస్ పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేసేవాడిని గుర్తు చేశారు. వాజీద్ అకాల మరణం తనను ఎంతో కలిచి వేసిందన్నారు. ప్రభుత్వ దవాఖానలో మృతదేహాలను పరిశీలించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం జోగిపేటలో నిర్వహించిన అంత్యక్రియల్లో మాజీ ఎమ్మెల్యేతో పాటు మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ జైపాల్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, మాజీ ఎంపీపీ రామాగౌడ్ ఇతర నాయకులు పాల్గొన్నారు.