మెదక్ రూరల్/ చిన్నశంకరంపేట/ రామాయంపేట/ తూప్రాన్/ వెల్దుర్తి , జనవరి 25 : మెదక్ మండల పరిధిలో జానకంపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఎంపీడీవో శ్రీరాములు, ఏపీఎం ఇందిర తదితరులు బుధవారం కంటి వెలుగు శిబిరాన్ని సంద ర్శించి, కంటి పరీక్షలను పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది, నాయకులు, పంచాయతీ కార్యదర్శి ఉన్నారు.
కొనసాగుతున్న కంటి పరీక్షలు
చిన్నశంకరంపేట మండలంలోని చెన్నాయపల్లి గ్రామం లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు సందర్శించారు. కంటి వెలుగు కార్యక్రమా న్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయిసింధు, సర్పంచ్ బాలమణి, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
మూడు రోజుల్లో 405 మందికి పరీక్షలు
రామాయంపేట, జనవరి 25 : మండలంలోని కోనాపూర్ గ్రామంలో కంటి వెలుగు శిబిరం కొనసాగుతున్నది. మూడు రోజులుగా 405 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యురాలు డాక్టర్ శ్రావణి తెలిపారు. 121 మందికి అద్దాలను అందజేయడంతోపాటు 90 మందిని జిల్లా కేంద్ర దవాఖానకు రెఫర్ చేసినట్లు వివరించారు. కంటి వెలుగు వైద్యులు, సిబ్బందికి అంబేద్కర్ యువజన సంఘం నేతలు పండ్లు అం దజేశారు. కార్యక్రమంలో సిబ్బంది సూపర్వైజర్ శ్యామల, ఏఎన్ఎం శోభ, వైద్యసిబ్బంది శ్రీనివాస్, స్వాతి, కల్యాణి, మంజుల, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు రాజేందర్, రమేశ్, రవీందర్, రింకు, స్వామి, రాజు ఉన్నారు.
అంధ్వత్వ రహిత తెలంగాణే లక్ష్యం..;తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్
అంధ్వత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్ అన్నారు. తూప్రాన్ మున్సిపాలిటీలో 6వ వార్డులో ఆయుర్వేద దవాఖానాలో కంటి వెలుగు శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచిం చా రు. బుధవారం 122 మందికి పరీక్షలు నిర్వహించి, 13 మం దికి అద్దాలను పంపిణీ చేశారు. 26 మందికి శస్త్ర చికిత్స అవసరమని నిర్ధారించారు. ఇప్పటివరకు తూప్రాన్ మున్సిపల్లో 835 మందికి కంటి పరీక్షలు, 251 మందికి అద్దాలు అందజేశామని, 98 మందికి ఆపరేషన్ల కొరకు రెఫర్ చేసినట్లు కంటి వెలుగు ప్రత్యేకాధికారి కృష్ణమూర్తి తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ జ్యోతీరవీందర్గుప్త్తా, మున్సిపల్ కమిషనర్ మో హన్, నాయకులు సత్యలింగం, తలారి మల్లేశ్, ఏర్పుల లక్ష్మ ణ్, డాక్టర్ రుక్సానా, బాల్నర్సయ్య పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలి
వెల్దుర్తి గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని జడ్పీటీసీ రమేశ్గౌడ్, సర్పంచ్ భాగ్యమ్మ సందర్శిచారు. అంధత్వ నివారణకు చేపట్టిన కంటి వెలు గు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వీరివెంట తహసీల్ద్దార్ సురేశ్, అధికారులు ఉన్నారు.
అందరికీ నేత్ర పరీక్షలు : డీపీవో సాయిబాబా
మనోహరాబాద్, జనవరి 25 : కంటి వెలుగు కార్యక్రమా న్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీపీవో సాయిబాబా అన్నారు. మనోహరాబాద్ మండలం కొండాపూర్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీవో లక్ష్మీనర్సింహులు, సర్పంచ్ చింతల మమతారవి ముదిరాజ్, ఉప సర్పంచ్ వెంకటేశ్యాదవ్, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.