సిద్దిపేట, మార్చి 24: చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ కలిసి నిర్వహించుకునే పండుగ హోలీ అందరి జీవితాల్లో రంగులు నింపాలని ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ నాయకత్వంలో పండుగలకు ప్రాధాన్యత పెరిగిందని, అన్నివర్గాల ప్రజలు వారి పండుగలను సుఖ సంతోషాలతో జరుపుకొంటున్నారని తెలిపారు. చిన్నపిల్లలకు హోలీ రంగులు కళ్లల్లో పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఈ పండగను సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. రసాయనాలతో కూడిన హానికరమైన రంగులతో కాకుండా సాధారణమైన రంగులు, నీటితోనే హోలీ పండుగను జరుపుకోవాలని హరీశ్రావు సూచించారు.