సిర్గాపూర్, నవంబర్ 23: మండలంలోని కిషన్నాయక్తండా పంచాయతీలో బెంగళూర్కు చెందిన వెల్స్ ఫార్గో సంస్థ బృందం బుధవారం పర్యటించింది. వెల్స్ ఫార్గో అందిస్తున్న నిధులతో కంగ్టి వాటర్ షెడ్ ఆర్గనైజేషన్ ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో రైతుల భూముల్లో చేపట్టిన జలవనరుల అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. సర్పంచ్ జగ్గురాంనాయక్, ఎంపీటీసీ లక్ష్మీబాయి రాథోడ్తో కలిసి శివారులో కలియతిరిగారు. భూగర్భ జలవనరుల అభివృద్ధికి ఈ సంస్థ ఆధ్వర్యంలో పడావు, గట్టు రాళ్ల ప్రదేశంలో నీటి కుంటలు, ఫాంపాండ్స్, కందకాలు, విడిరాళ్ల కట్టల అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సంస్థ ద్వారా రెండేండ్ల నుంచి చేపట్టిన నీటి నిల్వ కందకాలు, పర్క్యులేషన్ ట్యాంకులు 80కి పైగా నీటి కుంటల నిర్మాణంతో ఈ ఏడాదిలో కురిసిన వర్షాలకు నీటి వనరులు పెరిగి ప్రస్తుతం నిండుకుండల్లా ఉన్నాయి. వీటిని చూసిన బృందం ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పంచాయతీ వద్ద రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వెల్స్ ఫార్గో సంస్థ ప్రతినిధులు బంధన జా, నిధి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తమ సంస్థ చేపట్టిన అభివృద్ధి పనులతో భూగర్భ జల వనరులు అభివృద్ధి చెందాయన్నారు.
రైతు రెండో పంట పండిస్తూ సేద్యానికి నీరందిస్తున్నారన్నారు. రైతులను పోత్సహించి గ్రూపులుగా ఏర్పాటు చేసి వారికి సేంద్రియ ఎరువులతో పంటల సాగుకు సలహాలు, సూచనలిస్తూ, కృషి చేస్తున్న సంబంధిత అధికార టీం, గ్రామాల వసుంధర సేవక్లను వారు ప్రశంసించారు. కంగ్టి మండలంలోని మరో 18 గ్రామాల్లో ఈ సంస్థ ఆధ్వర్యంలో కూడా నాణ్యమైన పనులు చేయించిన సంస్థ టీం వర్క్ ను అభినందించారు. కార్యక్రమంలో ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రకాశ్ కేస్కర్, డైరెక్టర్ హరీశ్ దవరే, రీజినల్ మేనేజర్ జ్యోతిర్మయి, కంగ్టి వాటర్ సంస్థ ప్రాజెక్టు మేనేజర్ రవిప్రసాద్, చెన్నయ్య, సుధాకర్నాయక్, వసుంధర సేవక్ నాందేవ్ పాల్గొన్నారు.