మెదక్ అర్బన్, జనవరి 11 : నేర రహిత సమాజముగా తీర్చిదిద్దాలంటే నిందితులకు కోర్టులో శిక్ష పడే విధంగా కోర్టు సిబ్బంది శ్రమించాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిణి అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో కోర్టులో శిక్షల శాతం పెంచి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేసిన మెదక్ జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ షేక్ ఫజల్ అహ్మద్, అడిషన ల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభుధాన్యం, కోర్టు లైజనింగ్ అధికారి విఠల్, సిబ్బందిని ఎస్పీ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటీ నుంచి కేసు పూర్తయ్యేంత వరకు నిందితుల నేరాలను నిరూపించేందుకు అవసరమైన రుజువులు, పత్రాలు, సాక్షుల వాగ్మూలాన్ని కోర్టుకు సమర్పించడంలో కోర్టు పోలీస్ అధికారులు పనితీరులో వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని సూచించారు.
పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కోర్టు కానిస్టేబుల్ అధికారులు తమ విధిలో భాగంగా ఎప్పటికప్పుడు ఎన్బీడబ్ల్యూ క్రమం తప్పకుండా అమలు పరిచి నేరస్తులకు శిక్షలు పడే విధంగా కృషి చేయాలన్నారు. కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైనదని, కోర్టులో ఎఫ్ఐఆర్లను సరైన సమయంలో అందించాలన్నారు. కేసుల్లో ఉన్నటువంటి ప్రాపర్టీని సరైన సమయంలో కోర్టు నందు డిపాజిట్ చేయాలని సూచించారు. కోర్టులో బాధితులకు న్యాయం జరిగే వి ధంగా నేరస్తులకు శిక్షలు పడే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. నేరస్తులకు వారంట్స్, సమన్స్, సత్వరమే ఎగ్జిక్యూటివ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు ప్రాసిక్యూషన్కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్హౌజ్ ఆఫీసర్కు తెలియజేయాలన్నారు. కోర్టు క్యాలెండర్ ఎప్పటికప్పడు అప్డెట్ చేయాలని కేసుల ట్రయల్స్ సమయం లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క సలహాలు సూచనలు స్వీకరించాలన్నారు. కార్యక్రమంలో మెదక్ డిఎస్పీ సైదులు, మెదక్ పట్టణ సీఐ మధు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.