మెదక్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పా ఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు దోహ దం చేసేలా విద్యా బోధన చేస్తున్నామని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఆదివారం మెదక్ కలెక్టరేట్ నుంచి ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మెదక్ జిల్లాలో సోమవారం ప్రభుత్వ పాఠశాలలు 928, ప్రైవేట్ పాఠశాలలు 109 ప్రారంభమవుతాయని తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పున: ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. బడిబాటలో 1,26,000 మంది విద్యార్థులను గుర్తించామని తెలిపారు.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించామని, తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. విద్యార్థులు తరగతి గదిలోకి కొత్త ఉత్సాహంతో అడుగు పెట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. క్రమ శిక్షణతో చదువుకొని ఉజ్వల భవిష్యత్ సొంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని, పరిసరాల శుభ్రంగా ఉంచాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. బడి బాట కార్యక్రమంలో మొదటి రోజు విద్యార్థులకు కొత్త పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అం దించాలన్నారు. విద్యార్థుల హాజరు శాతం పెం పుతో పాటు డిజిటల్ విద్యా బోధనకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొ న్నారు.