ఇండ్లు లేని నిరుపేదలందరికీ సీఎం కేసీఆర్ రూ.వేల కోట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని, విడుతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పంపిణీ చేస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి అన్నారు. హత్నూర మండల కేంద్రంలో మంగాపూర్, బోర్పట్లలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించి పట్టాలు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏండ్లుగా అద్దె ఇంట్లో ఉంటూ కిరాయిలు చెల్లిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారందరి కష్టాలు తీరబోతున్నాయన్నారు. సొంత జాగా ఉండి ఇల్లు నిర్మించుకోవలనుకునే వారికి ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నదని తెలిపారు. మండలంలోని 38 పంచాయతీలకు ఒక్కొక్కదానికి రూ. 15లక్షల చొప్పున ప్రత్యేక నిధులు విడుదలయ్యాయని, త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు.
– హత్నూర, సెప్టెంబర్ 15
హత్నూర, సెప్టెంబర్ 15 : పేదోడి సొంతింటి కల నెరవేర్చడంకోసం రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం ప్రవేశపెట్టి అర్హులైన ప్రతి నిరుపేదకు ఇండ్లు కేటాయిస్తున్నదని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర లేబర్వెల్ఫేర్బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలం లోని మంగాపూర్, బోర్పట్ల గ్రామాల్లో ప్రభు త్వం నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ సొంత ఇంటి స్థలం, ఇల్లు లేని నిరుపేదలకు చే యూతనిచ్చేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మించి పంపిణీ చేస్తుందన్నారు.
గ్రామాల్లో నిరుపేదలను గుర్తించి అర్హులైన వా రి జాబితా తయారు చేసి వారికి ఇండ్ల స్థలాలు, ఇండ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని విడుతల వారీగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నదన్నారు. అర్హులై ఉండి ప్రభుత్వం ద్వారా ఇండ్లు రాలేనివారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి కూడా ఇండ్లు, ఇండ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని తెలిపా రు. ఎన్నో ఏండ్లుగా అద్దె ఇండ్లల్లో కిరాయికి ఉంటున్న పేదవారు నేడు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఇండ్ల ద్వా రా వారి సొంతింటి కల నెరవేరి కుటుంబ సమేతంగా కొత్త ఇండ్లల్లోకి ప్రవేశిస్తూ ప్రభుత్వాన్ని దీవిస్తున్నారని తెలిపారు.
మంగాపూర్లో 30మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేయడంతో పాటు బోర్పట్లలో ఇండ్లు పూర్తయిన లబ్ధిదారులకు పట్టా సర్టిఫికెట్లు అందజేశారు. హత్నూర మండలంలోని 38 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఒక్కో పంచాయతీకి ప్రత్యేక నిధులు రూ. 15లక్షల చొప్పున మంజూరు చేసిందని త్వరలో నిధులు విడుదల కానుండటంతో పనులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్సింహులు, జడ్పీటీసీ ఆంజనేయులు, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో శారదాదేవి, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, యువత అధ్యక్షుడు కిశోర్, రైతుబంధు సభ్యులు బుచ్చిరెడ్డి, విఠల్రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఏ ప్రభుత్వం ఇలా ఆదుకోలే
నాజీవితంలో ఏ ప్రభుత్వం ఇలా పేదవారిని ఆదుకోవడం చూడలేదు. ఇల్లులేని నిరుపేదలకు ప్రభుత్వమే ఇండ్లు కట్టించి ఇవ్వడం గొప్పవరం. సొంత ఇల్లు లేక అనేక తిప్పలుపడుతున్న పేదలకు అండగా నిలిచి ఇల్లు కట్టించి ఇవ్వడం సంతోషంగా ఉంది. ప్రభుత్వ సాయం జీవితంలో మర్చిపోను. మళ్లీ సీఎం కేసీఆర్ సార్ ప్రభుత్వమే రావాలని భగవంతుడిని మొక్కుకుంటున్నా.
– తలారి నర్సమ్మ, లబ్ధిదారు, మంగాపూర్
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
పేదప్రజల సంక్షేమానికి కృషిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేదప్రజలం ఎల్లప్పుడు రుణపడి వుంటాము. సొంత ఇల్లులేక కొన్నేండ్లుగా ఇబ్బందులు పడుతున్న మాలాంటి నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లుకట్టించి సర్టిఫికెట్లు అందజేయడం జీవితంలో మర్చిపోలేము. ఎమ్మెల్యే మదన్రెడ్డి, సీఎం కేసీఆర్ సార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– ఒగ్గు సుజాత, లబ్ధిదారు, మంగాపూర్
హామీలు మరిచిన ప్రభుత్వాలనే చూశాం
గతంలో ఎలక్షన్ల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన తరువాత ఇచ్చిన హామీలను మర్చిపోయిన ప్రభుత్వాలనే చూశాము. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన హామీలను పకడ్బందీగా అమలుచేస్తున్న ఏకైక ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రభుత్వమే అని గొప్పగా చెప్పుకుంటాము. పేదప్రజల సంక్షేమానికి కృషిచేస్తున్న ప్రభుత్వానికి పేదల దీవెనలు ఎల్లప్పడు ఉంటాయి.
– దేవులపల్లి సరిత, లబ్ధిదారు, మంగాపూర్