అందోల్/నిజాంపేట, నవంబర్ 27: రోజురోజుకూ కూలీల కొరత పెరిగిపోతుండడంతో రైతులు వ్యవసాయంలో యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. వరికోతలకు హార్వెస్టర్లను విరివిగా వినియోగిస్తుండడంతో గడ్డి వినియోగం తగ్గిపోయింది. పశువులు ఉన్న రైతులు వరిగడ్డిని నిల్వ చేసుకుంటుండగా, మిగతా రైతులు పొలంలోనే వదిలేస్తున్నారు. తదుపరి పంటకు పొలాన్ని సిద్ధం చేసే క్రమంలో వరికొయ్యలతో పాటు వరిగడ్డ్డికి నిప్పు పెడుతున్నారు. రైతులు అవగాహన లోపంతో చేస్తున్న ఈ చర్యతో భూసారానికి ముప్పు పొంచి ఉందని వ్యవసాయశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
నిప్పుపెడితే కలిగే నష్టాలు..
కలియ దున్నితే ఎన్నో లాభాలు…