నర్సాపూర్/ కౌడిపల్లి, సెప్టెంబర్ 28 : సీఎం కేసీఆర్ దూర దృష్టితో అమలు చేస్తున్న వివిధ పథకాలతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, మన అభివృద్ధ్దిని చూసి యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తుందని ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నర్సాపూర్ మున్సిపల్ కా ర్యాలయంలో కమిషనర్ చాముండేశ్వరి ఆధ్వర్యంలో మహిళ లకు బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే మదన్రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రజా సంక్షే మానికి అనేక పథకాలను అమలు చేస్తు న్నట్లు తెలిపారు. 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు పథకాలతో అన్నివర్గాల ప్రజలు ఆర్థికాభివృద్ధి చెందుతున్నారని వివరించారు. అన్ని మతాల పండుగలను గౌరవిస్తూ ప్రభు త్వం పేదప్రజలకు కానుకలు అందజేస్తున్నదన్నారు. దసరా సందర్భంగా ప్రభుత్వం ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపి ణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, పీఏసీఎస్ చైర్మన్ రాజూయాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణాధ్యక్షుడు భిక్షపతి, నాయకులు శ్రీధర్గుప్తా, అశోక్గౌడ్ పాల్గొన్నారు.
– కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు లబ్ధి
సీఎం కేసీఆర్ ఆడపడుచులకు పెద్దన్నగా బతుకమ్మ చీరలు అందజేస్తున్నారని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. కౌడిపల్లిలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బతుకమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ ఎమ్మెల్యే సందర్భంగా మదన్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత మన బతుకమ్మకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్కు ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కవితాఅమర్సింగ్, వైస్ ఎంపీపీ నవీన్కుమార్గుప్తా, కౌడిపల్లి సర్పంచ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చిలుముల వెంకటేశ్వర్రెడ్డి, మహమ్మద్నగర్ డీసీసీబీ వైస్ చైర్మన్ చిన్నంరెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు అహ్మద్, ఎంపీడీవో భారతి, తహసీల్దార్ వెంకటేశం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రామాగౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
నర్సాపూర్ మండలంలో..
నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలను వైస్ ఎంపీపీ వెంకటనర్సింగరావు, సర్పంచ్ శివకుమార్ పంపిణీ చేశారు. గ్రామంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నీటి సమస్యను తీర్చడానికి ఎమ్మెల్యే మదన్రెడ్డి సహకారంతో బోర్ వేయించామన్నారు. అనంతరం పం చాయతీ పాలకవర్గం సమావేశాన్ని ఏర్పాటు చేసి గ్రామంలోని అభివృద్ధ్ది పనులపై చర్చించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగరాజు, వార్డు సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
మెదక్ మున్సిపాలిటీలో చీరలు పంపిణీ
పట్టణంలో వివిధ వార్డుల్లో మహిళలకు బతుకమ్మ చీరలను మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ స్థానిక కౌన్సిలర్లు జయరాజ్, లక్ష్మీనారాయణగౌడ్, రుక్మిణీకృష్ణతో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మెప్మా మహిళలు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
గ్రామాల్లో బతుకమ్మ చీరల పంపిణీ..
రామాయంపేట మండలంలోని రాయిలిపూర్, దామరచెర్వు గ్రామాల్లో బతుకమ్మ చీరలను సర్పంచ్లు నర్సాగౌడ్, పడాల శివప్రసాద్రావు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పాకాల శ్రీలత, ఉప సర్పంచ్ దండు రమేశ్ ఉన్నారు. వెల్దుర్తి మండల కేంద్రంలో బతుకమ్మ చీరలను సర్పంచ్ భ్యాగమ్మ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏవో బలరాంరెడ్డి, స్థానిక నాయకుడు ఆంజనేయులు పాల్గొన్నారు.
శివ్వంపేట మండలంలోని పెద్దగొట్టిముక్ల, తిమ్మాపూర్ గ్రామాల్లో సర్పంచ్లు చంద్రకళాశ్రీశైలంయాదవ్, అనూషా అశోక్గౌడ్ మహిళలకు చీరలు అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు నవీన్, పంచాయతీ కార్యదర్శులు బానోత్ కవిత, శ్రీకాంత్ పాల్గొన్నారు.