శివ్వంపేట/ వెల్దుర్తి, డిసెంబర్ 9 : శివ్వంపేట మండలం గూడురు గ్రామంలో కన్నెస్వాములు ప్రకాశ్, ప్రవీణ్ స్వగృహంలో అయ్యప్ప మహాపడిపూజ నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి వేర్వేరుగా హాజరై అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఒక్కరూ భక్తిభావం కలిగి ఉండాలని, అప్పుడే మనశ్శాంతి కలుగుతుందన్నారు. భక్తితోనే శాంతిమార్గం ఏర్పడుతుందన్నారు. అయ్యప్ప ఆశీస్సులతో నర్సాపూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ మహేశ్గుప్తా, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, సర్పంచ్ స్వరాజ్యలక్ష్మీశ్రీనివాస్గౌడ్, ఎంపీటీసీలు సత్తిరెడ్డి, నేతలు సిలువేరు వీరేశం, కొడకంచి శ్రీనివాస్గౌడ్, యాదాగౌడ్, భీమనపల్లి మురళీ, బేగరి నర్సయ్య, సూర్యం చౌహాన్ ఉన్నారు.వెల్దుర్తి పట్టణానికి చెందిన శ్రీధర్రెడ్డి నివాసంలో అయ్యప్ప మహాపడిపూజ నిర్వహించారు. గురుస్వాములు వెంకట్గౌడ్, అశోక్గౌడ్, రాజయ్య ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడిపూజను నిర్వహించారు.