మెదక్, ఫిబ్రవరి 14 : మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాయల జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 1వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే జాతరకు సుమారు 8 నుంచి 10 లక్షల మంది భక్తులు రానున్నట్లు తెలిపారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మార్చి 1న శివరాత్రి జాగరణ, 2న బండ్లు తిరుగుట, 3న రథోత్సవం ఉంటుందన్నారు. ఆర్డీవో, డీఎస్వో, సంబంధిత అధికారులు ఏడుపాయలలో ఏర్పాట్లపై దృష్టి సారించాలన్నారు. జాతరకు మూడు రోజుల ముందే అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
భక్తులు ఇబ్బంది పడకుండా క్యూలైన్లు ఏర్పా టు చేయాలని ఈవో శ్రీనివాస్కు సూచించారు. లడ్డూ ప్రసాదం, కొబ్బరికాయలు కొట్టే స్థలంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటున్నందున రోప్ పార్టీ పోలీసులను ఏర్పాటు చేయాలని డీఎస్పీకి సూచించారు. పార్కింగ్కు ఇబ్బందులు కలుగకుండా పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి నుం చి వాహనాలను తరలించడానికి చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. జాతరలో గట్టి పోలీసు బందోబస్తు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని పోలీస్, ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. రెండు రోజుల ముందుగా సింగూ రు నుం చి ఘనపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని నీటి పారుదల శాఖ అధికారులను కోరారు. 100 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని మత్య్సశాఖ అధికారిని ఆదేశించారు. భక్తులకు మంచినీటి కుళాయిలు, ట్యాంకర్లు ఏర్పాటు చేయాలన్నారు. 5 ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తూ అన్ని మందులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. 5 అంబులెన్స్లు ఏర్పా టు చేయాలని డీఎంహెచ్వోకు సూచించారు. అగ్నిప్రమాదాల నివారణకు బులెట్ వాహనాలని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. జాతర ఎగ్జిబిషన్లో ఏర్పా టు చేసే జాయింట్ వీల్ వంటి యంత్రాల బిగిం పు పనితీరు సరిగ్గా ఉందా పరిశీలించి అనుమతి ఇవ్వాలని సూచించారు. సాం స్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆలయ ఈవోకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, డీఎస్పీ సైదులు, ఆర్డీవోలు సాయి రాం, వెంకట ఉపేందర్రెడ్డి, ఈవో శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
డిజిటల్ లావాదేవీలు సురక్షితం:డిజిటల్ లావాదేవీల వాల్పోస్టర్ను ఆవిష్కరించిన మెదక్ కలెక్టర్ హరీశ్
డిజిటల్ లావాదేవీలు ఎంతో సులభతరం, సురక్షితమని మెదక్ కలెక్టర్ హరీశ్ అన్నారు. ‘గో డిజిటల్ గో సెక్యూర్’ అనే అంశంతో 2020-2025 నాటికి దేశమంతటా ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగించి నగదు రహిత డిజిటల్ లావాదేవీలు నిర్వహించాలన్న సంకల్పంతో భారతీయ రిజర్వు బ్యాంక్ ఈ నెల 14 నుంచి 18 వరకు పైనాన్షియల్ లటరసీ వారోత్సవాలు నిర్వహిస్తున్నదన్నారు. అందులో భాగంగా ముద్రించిన వాల్పోస్టర్ను కలెక్టర్ సోమవారం తన చాంబర్లో అదనపు కలెక్టర్ల్ ప్రతిమాసింగ్, రమేశ్ నాబార్డు ఏజిఏం సెసిల్ తిమోతి, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ వేణుగోపాల్రావు, ఆర్డీవో సాయిరాం, డీఆర్డీవో అదనపు ప్రాజెక్ట్ డైరక్టర్ భీమయ్యతో కలిసి ఆవిష్కరించారు.