సిటీబ్యూరో, మార్చి 11(నమస్తే తెలంగాణ): యాప్లతో వీడియో కాల్స్ చేస్తూ బ్లాక్మెయిలింగ్ చేస్తున్న ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుండటంతో దా నిని ఉపయోగిస్తూ యాప్లను తయా రు చేస్తున్నారు. ఈ కొత్త తరహా యాప్ల వెనుక చైనీయుల హస్తముందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ యాప్లు ఇప్పుడు సైబర్నేరగాళ్లకు ఆయుధంగా మారాయి. ఈ యాప్లను ఉపయోగిస్తూ ఫోన్లు చేస్తూ అబ్బాయిలు.. అమ్మాయి లా మారిపోతున్నారు. అవసరమైనప్పుడు ఆ యాప్.. మాట్లాడేవారు అబ్బాయి అయితే.. అమ్మాయి మాదిరిగా నగ్నంగా సూచిస్తున్నాయి. ఫొటోలను యాప్ల్లో ఫీడ్ చేస్తే.. అవి నగ్నంగా మారి అవతలి వాళ్లకు కన్పిస్తాయి. ఫేస్బుక్, వాట్సాప్ల ద్వారా కొత్తవారిని పరిచయం చేసుకోవడం .. వాళ్లతో కొద్ది సేపు అమ్మాయిలా మాట్లాడుతూ, ఆ తరువాత బ్లాక్మెయిలింగ్కు దిగుతున్నారు. ఇలా బ్లాక్మెయిలింగ్ బా రిన పడుతున్న బాధితులు ప్రతి రోజు సైబర్క్రైమ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు.
సైబర్నేరగాళ్లలో కొందరు నేరుగా మహిళలను దింపుతుండగా.. మరికొన్ని ముఠాలు ఇంటర్నెట్లో లభించే నీలిచిత్రాలు, వాయిస్ ఛేజింగ్ యాప్లను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇంకా.. కొందరు యాప్లను ఉపయోగించి.. అందులో అమ్మాయిని అబ్బాయిగా, అబ్బాయిని అమ్మాయిగా ఇష్టానుసారంగా ఫొటోలు, వీడియోలను మారుస్తున్నారని సైబర్క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు. ఇలాంటి కేసుల్లో బాధితులు చాల తక్కువ మందే పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ప్రతి రోజు 10 వరకు ఫిర్యాదులు పోలీసులకు అందుతున్నాయి. రాజస్థాన్ ముఠాలే ఈ ఘటనలకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.