వనపర్తి, డిసెంబర్ 17 : వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేలా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిపై కొందరు నాయకులు చేస్తున్న చిల్లర రాజకీయాలను మానుకోవాలని వాల్మీకి బోయల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హరిశంకర్ నాయుడు సూచించారు. జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో శుక్రవారం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రవినాయుడు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరిశంకర్ మాట్లాడు తూ రాష్ట్రంలో చట్టబద్ధంగా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తీ ర్మానం చేశారన్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాల్లో వాల్మీకులు ఎస్టీలుగా ఉన్నారని, ఉమ్మడి రాష్ట్రంలో ఐదు జి ల్లాలు మినహా అన్ని చోట్ల బీసీ-ఏగా ఉన్నారని, రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎస్టీ జాబితాలో చేర్చేలా కమిటీ వే స్తామని ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన మాటను గుర్తు చేశారు. ఆ మాట ప్రకారం సీఎం కేసీఆర్ చెల్లప్ప కమిటీ వేసి అసెంబ్లీ తీర్మానంతో నివేదికను కేంద్రానికి పంపారన్నారు. కేంద్రంలో పెండింగ్లో ఉన్న బిల్లును దమ్ముంటే పాస్ చేయించాలని విమర్శించారు. వాల్మీకి బోయల భవన నిర్మాణానికి హైదరాబాద్లోని ఉప్పల్లో ఎకరా స్థలాన్ని కేటాయించడంతోపాటు రూ.కోటి మంజూరు చేశారన్నారు. జిల్లా కేంద్రంలో వాల్మీకి విగ్రహంతోపాటు అర ఎకరాను మంత్రి నిరంజన్రెడ్డి కేటాయించారని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు, మార్క్ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ విజయ్కుమార్ నాయుడు, మాజీ కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్ నాయుడు, సంఘం నాయకులు నీలస్వామి, ఆశన్న, రామస్వామి, వెంకటయ్య, మన్యం, కేశవ్ తదితరులు పాల్గొన్నారు.