వనపర్తి
గద్వాల
కందనూలు
నారాయణపేట
పాలమూరు
మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగింది. మొత్తం 52 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బరిలో 21 మంది అభ్యర్థులు ఉండగా.. 8,159 మంది ఓటర్లు ఉన్నారు. పొద్దుగాల మందకొడిగా సాగినా సమయం ముగిసే సరికి పోలింగ్ ఊపందుకున్నది.అత్యధికంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో 97.15 శాతం ఓట్లు పోలవగా.. తర్వాత నాగర్కర్నూల్ జిల్లాలో 93.96శాతం, వనపర్తిలో 93.48 శాతం, నారాయణపేటలో 93.07 శాతం, మహబూబ్నగర్లో 88.01 శాతం నమోద య్యాయి. కేంద్రాలను ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు తనిఖీ చేశారు. టీచర్లు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, మెడికల్, ఇంజినీరింగ్, వ్యవసాయ కళాశాల లెక్చరర్లు ఓటేశారు. ప్రక్రియ పూర్తయ్యాక బ్యాలెట్ బాక్సులను బందోబస్తు మధ్య అధికారులు హైదరాబాద్కు తరలించారు. 16న అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కాటేపల్లి జనార్దన్రెడ్డి పదవీకాలం ముగియడంతో ఎన్నికలు జరిగాయి.
మహబూబ్నగర్, మార్చి 13: జిల్లావ్యాప్తంగా ఉ పాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారందరికీ కొంత ఆలస్యమైనా ఓటేసేందుకు అవకాశం కల్పించారు. జిల్లావ్యాప్తంగా 88.01శాతం పోలింగ్ ప్రక్రియ నమోదైనది. జిల్లాకేంద్రంలోని బాలుర కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు పోలింగ్ కేంద్రాల్లో ఉ దయం 9 నుంచి అత్యధికంగా ఓటర్లు ఓటుహక్కు ను వినియోగించుకునేందుకు వచ్చారు. 10గంటల వరకు 19.2శాతం పోలింగ్ సాగింది. మధ్యాహ్నం 12గంటల వరకు 42.33 శాతం ఓటింగ్ జరుగగా, మధ్యాహ్నం 2గంటల వరకు 64.32శాతం ఓటింగ్ సాగింది. పోలింగ్ ముగిసేసరికి జిల్లావ్యాప్తంగా 88.01శాతం పోలింగ్ జరిగింది.
పోలింగ్ కేంద్రాల సమీపంలో ఉపాధ్యాయ సం ఘాల నేతల సందడి కనిపించింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటేసే ఓటర్లకు కనీసం ఒక్కరికీ 5నిమిషాల సమయం తీసుకున్నట్లు తెలిసింది. జిల్లావ్యాప్తంగా 15పోలింగ్ కేంద్రాంల్లో సాగింది. జిల్లాకేంద్రంలోని మోడల్ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ రవినాయక్ పరిశీలించారు. పోలింగ్ శాతాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముందస్తు జాగ్రత్తలు సత్ఫలితాలను ఇచ్చాయని, ప్రశాంత వాతావారణంలో ఎన్నికలు ముగిసినట్లు కలెక్టర్ తెలిపారు. బాలుర కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు పోలింగ్ కేంద్రాలను ఎస్పీ నరసింహా ప్రత్యేకంగా పరిశీలించారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రక్రియ ముగిసిందని ఎస్పీ తెలిపారు.
మహబూబ్నగర్, మార్చి 13: జిల్లాకేంద్రంలో బాలుర కళాశాలలోని పోలింగ్ కేంద్రం 40లో 806మందికిగానూ 714మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 41లో 859ఓట్లకు గానూ 756ఓట్లు పోలింగ్ జరిగింది. 43లో 907ఓట్లకు గానూ 769ఓట్లు పోలయ్యాయి. ఈ మూడు కేం ద్రాల్లో అత్యధిక ఓటర్లు ఉండడంతో అలస్యంగా పోలింగ్ ముగిసింది. రాత్రి 7:15గంటల వరకు ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు.