మహబూబ్నగర్, మార్చి 10 : అభివృద్ధి పనులు జరుగాలంటే నిధులు అవసరమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సక్రమంగా పన్నులు చెల్లిస్తూ అందరికీ ఆదర్శమైన జీవితాలను గడుపుతూ ముందుకు సాగాలంటుంది ప్రభుత్వం. ఈ దిశగానే పట్టణాలకు పరిమితమైన చెత్త సేకరణ, వాటర్ ట్యాంక్ల ద్వారా అత్యవసర నీటి సరఫరా, వీధి దీపాలతోపాటు సకల సౌకర్యాలను ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో అమలు చేస్తోంది. అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ప్రతి గ్రామ పంచాయతీలోనూ పన్నులు క్రమం తప్పకుండా చెల్లించాలనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా నిర్మాణాలు అత్యధికంగా జరుగడంతోపాటు ప్రతి గ్రామంలోనూ పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ప్రజల్లో అవగాహన సైతం పెరిగింది. దీంతో ఈ ఏడాది గ్రామ పంచాయతీల్లో జిల్లా వ్యాప్తంగా రూ.7.10 కోట్లను వసూలు చేసే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. జిల్లావ్యాప్తంగా 441 గ్రామ పంచాయతీల్లో పూర్తిస్థాయిలో పన్నులు వసూలు చేసే పనిలో అధికారులు నిమగ్నమై ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే పన్ను వసూలు తుది దశకు చేరుకోగా వందశాతం పన్నులు వసూలు చేసే లక్ష్యాన్ని నిర్దేశించుకుని అధికార యంత్రాంగం ముందు కు సాగుతున్నది.
పెరిగిన పారదర్శకత
గ్రామ పంచాయతీల్లో గతంలో కంటే ఈ ఏడాది పారదర్శకత చాలా మెరుగుపడింది. కేవలం ఇంటి అనుమతులు మాత్రమే ఆన్లైన్ చేసిన సర్కారు క్రమంగా పారదర్శకంగా ఉండేందుకుగానూ ప్రతి పనిని ఆన్లైన్ చేసిన విషయం విదితమే. పన్ను వసూళ్లు సైతం గ్రామ పంచాయాతీల్లో వేగంగా అధికారులు ముందుకు సాగుతుండ్రు. మార్చి చివరి నాటికి వంద శాతం పన్ను వసూలు చేసేందుకుగానూ అధికారులు సన్నాహాలు చేస్తూ గ్రామాల్లో విస్తృత ప్రచారం కల్పిస్తుండ్రు.
క్రమం తప్పకుండా పన్నులు చెల్లించాలి
ప్రజలు వారి ఇంటి పన్ను ను క్రమం తప్పకుండా చెల్లించాలి. అప్పుడే గ్రామా ల అభివృద్ధికి మరింత తోడ్పాటు లభిస్తుంది. ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లించేందుకు స్వతహాగా ముందుకు రావాలి. వందశాతం ప న్నులు చెల్లించాలి. చెల్లిస్తున్న పన్నులు గ్రామాల అభివృద్ధికి ఎంతో దోహదపడుతాయి. మార్చి చివరిలోగా వంద శాతం పన్నులు వసూలు చేస్తాం. ఈ పనిమిదే పంచాయ తీ కార్యదర్శులు ఉన్నారు. పన్నులు చెల్లించాలని గ్రా మాల్లో విస్తృత ప్రచారం కల్పిస్తున్నాం.
– వెంకటేశ్వర్లు, డీపీవో, మహబూబ్నగర్