మరికల్, డిసెంబర్ 27 : విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని ఏఎస్సై శ్రీదేవి అన్నారు. మండలంలోని ధ న్వాడ కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో పోలీస్ కళాజాత బృందం ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు వి విధ అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉండే విధంగా చేసుకోవాలని సూచించారు. అపరచిత వ్యక్తులు కనిపిస్తే డయాల్ 100కు ఫోన్ చేయాలని, బాల్యవివాహాలను అరికట్టాలని, ఆన్లైన్ మో సాలు, సైబర్నేరాలపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆట, పాటలతో రాణించాలన్నారు. కార్యక్రమంలో కళాజాత బృందం సభ్యులు, పో లీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు
విద్యార్థులకు క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, చదువుతోపాటు క్రీ డల్లో రాణించాలని ఎంపీడీవో కాళప్ప అన్నారు. మం డలంలోని చిన్నపొర్లలో మంగళవారం క్రీడా ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించారు. నూతన క్రీడా ప్రాంగణం లో విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. గ్రా మీణ క్రీడాకారుల్లో క్రీడా నైపుణ్యతను పెంచేందుకు ప్రభు త్వం ప్రతి పాఠశాలకు క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసిందని ఎంపీడీవో అన్నారు. విదార్థులు, యువత క్రీడలపై ఆస క్తి పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్రెడ్డి, ఎంపీటీసీ రవి ప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జగన్నాథరావు, ఉపాధ్యాయు లు తదితరులు పాల్గొన్నారు.
క్రీడా పోటీలు ప్రారంభం
మండలంతోపాటు మద్దెలబీడు పాఠశాలల క్రీడా ప్రాంగణాలను ఎంపీడీవో, ఎంపీవో రా మన్న మంగళవారం ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ ఆటలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ చాలా గ్రామాల పాఠశాల ల్లో క్రీడా ప్రాంగణాలు ఉన్న విద్యార్థులకు ఆటలు ఆడించ డం లేదని, అందుకే ప్రతి పాఠశాలలో విద్యార్థులకు ఆటలు ఆడించాలన్నారు. విద్యార్థుల శరీర దారుఢ్యంతోపాటు మా నసిక ఉల్లాసం ఏర్పడి చదువు బాగా వస్తుందన్నారు. కార్యక్రమంలో ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.