మహబూబ్నగర్ అర్బన్, మే 28 : పాలమూరు విశ్వవిద్యాలయానికి తెలంగాణ వైతాళికుడు, సంఘ సంస్కర్త సురవరం ప్రతాప్రెడ్డి పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ దృష్టకి తీసుకెళ్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. పాలమూరు రెడ్డి సేవాసమితి ఆధ్వర్యంలో స్థానిక బండమీదపల్లిలో ఉన్న రెడ్డి కన్వెన్షన్ సెంటర్లో సురవరం ప్రతాప్రెడ్డి, యోగి వేమన, రాజాబహుదూర్ వెంకట్రామిరెడ్డి విగ్రహాలను మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్రెడ్డి జ యంతి రోజున అయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సురవరం తమ కులాల కోసం పనిచేయలేదని, సమాజ మొ త్తాన్ని తమ కుటుంబంగా భావించి తమ ఆస్తులను త్యాగం చేసిన మహనీయులన్నారు. తెలంగాణలో కవులు లేరంటే.. చెంపపెట్టు సమాధానం ఇచ్చి గోల్కొండ పత్రికతో ప్రజలను చైతన్యం చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. అటువంటి మహానుభావుడు మన జిల్లాకు చెందిన వ్యక్తి కావడం హర్షణీయమన్నారు. ఆయన పేరును పాలమూరు యూనివర్సిటీకి పెట్టేందుకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
రెడ్డి హాస్టల్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులు ఉన్నత విద్యకు కృషి చేసిన మహానుభావుడు రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. పాలమూరులో ఇప్పటికే అమరరాజా పరిశ్రమ ఏర్పాటైందని, త్వరలో మరో రెండు పరిశ్రమలు వస్తాయని తెలిపారు. ఐదేళ్లలో కనీసం 30వేల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పాలమూరు రాజా బహదూర్ కన్వెన్షన్ సెంటర్లో పలు అభివృద్ధి పనుల కోసం రూ.30లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద రెడ్డి హాస్టల్ కోసం సుమారు రూ.వెయ్యి కోట్ల విలువైన ప్రభుత్వ భుమిని తెలంగాణ ప్రభుత్వం అందించిందని గుర్తుచేశారు.
అనంతరం సురవరం కుటుంబ సభ్యులను మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మ న్ గణేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మ న్ గిరిధర్రెడ్డి, రెడ్డి సేవా సమితి ఉమ్మడి జి ల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాఘవరెడ్డి, రాజేందర్రెడ్డి, జి ల్లా అధ్యక్షుడు ధనుంజయరెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి పాల్గొన్నారు.