అలంపూర్, ఫిబ్రవరి 26 : మహాశివరాత్రిని పురస్కరించుకొని అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరాలయంలో సోమవారం ఎమ్మెల్యే విజయు డు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సప్తాహ భజనలను ప్రారంభించారు. రాత్రి, పగలు తేడా లేకుం డా వారంపాటు నిరంతరం కొనసాగే కార్యక్రమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 60 బృందాలు పా ల్గొంటాయని నిర్వాహకులు కోనేరు చిన్న కృష్ణయ్యనాయుడు తెలిపారు. ఆలయంలో సప్తాహం నిర్వహించడం ఈ ఏడాదితో 18వ సారి అని ఆయన తెలిపారు. అనంతరం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దర్శించుకున్నారు.
వారికి ఆలయ కమిటీ చైర్మన్ చిన్న కృ ష్ణయ్యనాయుడు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగ తం పలికారు. స్వామి, అమ్మవారి ఆలయాల్లో నివేదన కార్యక్రమానికి హాజరుకాగా, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను అర్చకులు శేషవస్ర్తాలతో సత్కరించి తీర్థ ప్ర సాదాలు అందజేశారు. తిరుగు ప్రయాణంలో బూర్దిపాడు సర్కిల్ వద్ద అలంపూర్ దేవస్థానం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న శివనంది విగ్రహ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నంది విగ్రహ దాత రమేశ్ను సన్మానించారు.