ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారుల కృష్ణుడు, గోపికల వేషధారణలు ఆక ట్టుకున్నాయి. సాయంత్రం పల్లెపల్లెనా.. వీధివీధిన ఉట్లు కొట్టే కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాలు పంచుకున్నారు. ఆయా గ్రామాల్లో శ్రీకృష్ణుడి విగ్రహాలను ఊరేగించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారి నామస్మరణలో తన్మయత్వం చెందారు.
నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 7: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను గురువారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. చౌక్ బజార్ మిత్రమండలి ఆధ్వర్యంలో ధ్వజారోహణం, శ్రీకృష్ణుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీకృష్ణ మందిరంలో డోలారోహణ కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా వీహెచ్పీ నాయకులు శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన చౌరస్తాల్లో ఉట్లు కొట్టే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా తల్లిదండ్రులు తమ చిన్నారులను కృష్ణుడు, గోపికలుగా అలంకరించి మురిసిపోయారు. సరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
మక్తల్టౌన్, సెప్టెంబర్ 7: పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానిచారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో పాలఉట్ల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో యాద వ యువకులు ఉత్సాహంగా పాల్గొని ఉట్లు కొట్టేందుకు పోటీపడ్డారు. ఉట్ల వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని యువకులను ఉత్సాహ పరిచారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
మక్తల్ పట్టణంలోని 14వ అంగన్వాడీ కేంద్రంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు కృష్ణుడు, గోపిక వేషధారణలో నృత్యం చేస్తూ అలరించారు.
మరికల్ , సెప్టెంబర్ 7: మండల కేంద్రంలోగురువారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీకృష్ణుడికి పల్లకీ సేవ నిర్వహించారు. ఆంజనేయస్వామి ఆల యం నుంచి భజన సంకీర్తనల మధ్య పల్లకీ ఊరేగింపు నిర్వ ఈ సందర్భంగా చిన్నా రులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు. సాయంత్రం యువకులు ఉత్సాహంగా ఉట్లు కొట్టారు.
దన్వాడ, సెప్టెంబర్ 7 : మండలంలోని మందిపల్లి పాతతండాలో శ్రీకృష్ణుడి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం ఆలయం ప్రాంగణంలో హోమం నిర్వహించారు. ఉత్సవాల్లో మండలంలోని వివిధ తండాలకు చెందిన గిరిజనులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజవర్ధన్ రెడ్డి, వెంకట్రెడ్డి, కిషన్నాయక్, సంతోష్ నాయక్, సర్పంచ్ వెంకట్నాయక్, చంద్రశేఖర్, సునీల్రెడ్డి, వీరేశ్గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కోస్గి, సెప్టెంబర్ 7 : కోస్గి పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో గురువారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణుడి విగ్రహంతో శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల కోలాటాలు, నృత్యాల మధ్య పురవీధుల్లో ఊరేగించి శివాజీ చౌరస్తాలో ఉట్లుకొట్టారు. ఆనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిచారు. అలాగే పట్టణంలోని వివిధ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు రాధాకృష్ణుల వేషధారణలో ఉట్లు కొట్టి అలరించారు.
నర్వ, సెప్టెంబర్ 7 : మండలకేంద్రంలోని వేణుగోపాల స్వా మి ఆలయంలో గురువారం కృష్ణాష్టమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి అఖండ భజన నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వహకుడు గోకుల్సింగ్ మాట్లాడుతూ శుక్రవారం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం ఉట్ల కార్యక్రమం, పల్లకీ సేవ, రథోత్సవం, శనివారం బోనాలు, ఆదివారం రాత్రి స్వామివారికి ఊయల సేవ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
ఊట్కూర్, సెప్టెంబర్ 7 : మండల కేంద్రంతో పాటు నిడుగుర్తి గ్రామాల్లో కృష్ణాష్టమి వేడకలు కన్నుల పండువగా నిర్వహించారు. శ్రీకృష్ణా ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోపీ, గోపికల వేషధారణతో ముస్తాబైన చిన్నారులను పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, కోలాటలు ఆకట్టుకున్నాయి. అయోధ్యనగర్లో ఏర్పా టు చేసిన పాల ఉట్ల పోటీల్లో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.
మద్దూర్ (కొత్తపల్లి) సెప్టెంబర్ 7: మద్దూర్, కొత్తపల్లి మండలాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మద్దూర్లో పాఠశాలల విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషదారణలో నృత్యాలు చేస్తూ అలరించారు. అనంతరం ఉట్లు కొట్టారు.
కృష్ణ, సెప్టెంబర్ 7 : మండల కేంద్రంతో పాటు హిందూపూర్, ముడుమాల్, గుడెబల్లూర్ తదితర గ్రామాల్లో గురువారం జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుడెబల్లూర్ గ్రామంలోని స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీకృషుడి విగ్రహానికి క్షీరాభిషేకం చేసి సాయంత్రం ఉట్లు కోట్టే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు.
దామరగిద్ద, సెప్టెంబర్ 7: మండలంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దామరగ్ది, కందెన్ పల్లి, ఉడ్మల్గిద్ద గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారు లను రాధా కృష్ణుల వేషధారణలో ఉట్టి కొట్టించారు. కార్యక్ర మంలో అంగన్వాడీ టీచర్లు ప్రమీల, శకుంతల చిన్నారులు, యువకులు పాల్గొన్నారు.