నాగర్కర్నూల్, జనవరి 29 : క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడుతాయని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. జెడ్పీ క్రీడా మైదానంలో నాగర్కర్నూల్ జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను సోమవారం ఎస్పీ ప్రారంభించారు. అంతకుముందు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీస్ జట్లతో మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. అ నంతరం ఎస్పీ గైక్వాడ్, అదనపు ఎస్పీ, అదనపు ఎస్పీ రామేశ్వర్ శాంతికపోతాలను ఎగురవేసి, జెండాలను ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. ఈనెల 31వరకు కొనసాగనున్న క్రీడల్లో ఆరు జట్లు పాల్గొననున్నాయి.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్శాఖలో ఏటా క్రీడలు నిర్వహిస్తామన్నారు. డిపార్ట్మెంట్లో పోటీలు నిర్వహించడం ముఖ్యమైందన్నారు. సమయం ఉన్నప్పుడల్లా ప్రతి పోలీస్ అధికారి ఏదో ఒక క్రీడలో రాణించాలన్నారు. కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్కర్నూల్ నియోజకవర్గాలకు చెందిన పోలీసులు పాల్గొంటున్నారన్నారు. టీమ్తోపాటు సింగిల్గా ఆడే క్రీడలు ఉన్నాయని, పోలీసులు ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎస్పీ లు సత్యనారాయణ, మోహన్కుమార్, పార్థసారథి, చారి, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.