మహబూబ్నగర్టౌన్, జనవరి 11 : జిల్లా నెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇండోర్ క్రీడా మైదానంలో సౌత్జోన్ ఫాస్ట్ 5, 2వ సీనియర్ మహిళా, పురుషుల నెట్బాల్ చాంపియన్షిప్ పోటీలు గురువారం ఆట్టహసంగా ప్రారంభమయ్యాయి. దక్షిణాది నుంచి ఆరు రాష్ర్టాల జట్లు పాల్గొన్నాయి. పోటీలను డీవైఎస్వో శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. 320 మంది క్రీడాకారులు, 30 ఆఫిషియల్స్ టోర్నీలో పాల్గొంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి జట్ల క్రీడాకారులు తలబడుతున్నారు.
జిల్లా కేంద్రంలోని ఇండోర్ క్రీడా మైదానం లో జరుగుతున్న సౌత్జోన్ ఫాస్ట్ 5 మహిళా, పురుషుల నెట్బాల్ చాంపియన్షిప్ తెలంగాణ పురుషుల జట్టు శుభారంభం చేసింది. పురుషుల విభాగంలో జరిగిన మ్యాచ్లో తెలంగాణ జట్టు 16-05 స్కోర్ తేడాతో ఆంధ్రప్రదేశ్ జట్టుపై గెలిచింది. కేరళ జట్టు 29-12 స్కోర్ తేడాతో పుదుచ్చేరిపై కర్ణాటక జట్టు 38-04 స్కోర్ తేడాతో ఆంధ్రప్రదేశ్పై, కేరళ జట్టు 32-07స్కోర్తేడాతో తమిళనాడుపై గెలిచాయి. మహిళా విభాగంలో జరిగిన మ్యాచ్లో కర్ణాటక జట్టు 39-02స్కోర్తో ఆంధ్రప్రదేశ్పై, కేరళ జట్టుపై 22-13స్కోర్ తేడాతో పుదుచ్చేరి, కేరళ జట్టు 18-02 స్కోర్తేడాతో ఆంధ్రప్రదేశ్ జట్టుపై గెలిచాయి.
పట్టుదల క్రమశిక్షణతో ఆడితేనే క్రీడల్లో రాణిస్తారని డీవైఎస్వో శ్రీనివాస్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానంలో సౌత్జోన్ ఫాస్ట్ 5, మహిళా, పురుషుల నెట్బాల్ చాంపియన్షిప్ టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌత్జోన్ నెట్బాల్ టోర్నీకి మహబూబ్నగర్ వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. వివిధ రాష్ట్రల జట్ల క్రీడాకారులు టోర్నీలో చక్కటి ప్రతిభ చాటాలన్నారు. నెట్బాల్ క్రీడలో రాణించే క్రీడాకారులకు క్రీడాకోటలో పోస్టల్, పోలీస్, సెంట్రల్ ఎక్రైజ్, ఇన్కామ్టాక్స్ శాఖలో ఉద్యోగ అవకాశలు లభిస్తాయన్నారు. టోర్నీలో రాష్ట్ర జట్టు క్రీడాకారులు ప్రతిభ చాటి విజేతగా నిలవాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో నెట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆదిత్యరెడ్డి, ఖాజాఖాన్, ఉపాధ్యక్షుడు సాదత్ఖాన్, ట్రెజరర్ సోహెల్, రాంమోహన్, అంజద్, షకీల్, అక్రమ్ పాల్గొన్నారు.