ధరూరు, ఫిబ్రవరి 19 : ధైర్య సాహసాలకు ప్రతీక ఛత్రపతి శివాజీ మహరాజ్ అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా సోమవారం మండలంలోని ఉప్పేరులో ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే బండ్ల ఆవిష్కంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొగ ల్ చక్రవర్తులను ఎదిరించి, వినూత్నమైన యుద్ధ వ్యూహాలతో మరాఠ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన యోధుడు ఛత్రపతి శివాజీ అన్నారు. అంతటి ధైర్య సాహసాలు కలిగిన మహరాజ్ విగ్రహాన్ని గ్రామంలో ప్రతిష్ఠించుకోవడం గర్వంగా ఉందన్నారు.
అందరూ గ్రామంలో ఐక్యతగా ఉండి అందరి సంక్షేమం కోసం కృషి చేయాలని, అందుకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామన్గౌడ్, గట్టు ఎంపీపీ విజయ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, జాంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, ప్రభాకర్గౌడ్, రఘువర్ధన్రెడ్డి, హనుమంతురెడ్డి, కరుమన్న, ఆరె కటిక సంఘం జిల్లా, గ్రామ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఉప్పేరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ముక్తార్అలీ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.