వనపర్తిలో నేటి నుంచి సైన్స్ ఎగ్జిబిషన్
ఏడు అంశాల్లో 400 ప్రదర్శనలు
వనపర్తి టౌన్, నవంబర్ 18 : జిల్లా కేం ద్రంలోని సూర్యచంద్ర ప్యాలెస్లో శని వారం నుంచి రెండ్రోజులపాటు జిల్లా స్థా యి వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించనున్నా రు. ఎంపీపీ, జెడ్పీపీ, ప్రభుత్వ పాఠశాల లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ గురుకులాలు, ప్రైవేట్, అన్ఎయిడెడ్, మోడల్ స్కూల్స్, కేజీబీవీ పాఠశాలల నుంచి 400 ప్రదర్శనలకుగా నూ దాదాపు వెయ్యి మంది విద్యార్థులు పాలుపంచుకోనున్నారు. విద్యార్థుల్లో ఆలోచనా దృక్పథాల ను బాల్య దశ నుంచే పెంపొందించి శాస్త్రీయ వైఖరిని కలుగజేసేందుకు ఈ ప్రదర్శనలు దోహదపడనున్నాయి. ఈ నెల 19, 20వ తేదీల్లో ప్రదర్శనలు కొనసాగనున్నాయి. సైన్స్, గణితం, పర్యావరణ అంశాలపై ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
ప్రధానంగా సాంకేతికత-బొమ్మలు అనే దానిపై ఏడు ఉప అం శాల్లో వైజ్ఞానిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అందు లో సమాచారం-కమ్యునికేషన్ టెక్నాలజీలో పురోగతి, పర్యావరణ హితమైన పదార్థాలు, ఆరోగ్యం-పరిశుభ్రత, రవాణా-ఆవిష్కరణలు, పర్యావరణ అంశాలు, ప్రస్తుత ఆవిష్కరణతో చారిత్రాత్మక అభివృద్ధి, మన కోసం గణితం అనే ఉప అంశాలు ఉ న్నాయి. ముఖ్యంగా టెక్నాలజికల్ టాయ్స్ అనే అంశాలపై ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా, సైన్స్ ఎగ్జిబిషన్కు సంబంధించి డీఈవో రవీందర్, సెక్టోరియల్ అధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం విస్తృతస్థాయి సమావేశాన్ని ని ర్వహించారు. ఫుడ్, స్టేజీ కమిటీ, ఫైనాన్స్, జడ్జిమెం ట్ కమిటీ బాధ్యులతో చర్చించారు. మంత్రి నిరంజన్రెడ్డి రూ.లక్ష, డాక్టర్ మురళీధర్ రూ.50 వేలు, ప్రభుత్వం నుంచి వచ్చిన రూ.50 వేలతో ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు.