రంజాన్ వేడుకలను జిల్లాలో ముస్లింలు శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి ఈద్గాల వద్దకు చేరుకుని ముస్లింకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మక్తల్లోని ఈద్గా వద్ద సురక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి సరఫరాను ఎమ్మెల్యే చిట్టెం ప్రారంభించి ముస్లింలకు అందజేశారు. గ్రామాల్లోని ఈద్గాల వద్ద సర్పంచులు, ఎంపీటీసీలు, మండలకేంద్రాల్లో ఎంపీపీలు, జెడ్పీటీసీలతోపాటు ఆయా పార్టీల నాయకులు, అధికారులు ముస్లింలను ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
– నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 22