మహబూబ్ నగర్ : ఓటర్ల సవరణ జాబితా (SIR)లో గ్రామానికి చెందిన ఏ ఒక్క ఓటరు నమోదు తొలగిపోకుండా బీఆర్ఎస్ శ్రేణులు జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ( Ala Venkateshwar Reddy ) సూచించారు.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో భూత్పురు మండలంలోని వెల్కిచర్ల, బట్టుపల్లి గ్రామాలు, మహాబూబ్ నగర్ రూరల్ మండలం ఇప్పలపల్లి గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్చార్జిలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదు, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR ) కార్యక్రమం, బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదులో చురుకుగా పాల్గొనాలని కోరారు.