కొల్లాపూర్, ఫిబ్రవరి 20 : భక్తుల కొంగుబంగారమైన ఆది పరాశక్తి కొల్లాపూర్ ఈదమ్మ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సిడె కార్యక్రమాన్ని మంగళవారం క నులపండువగా నిర్వహించారు. తప్పెట్ల దరువుల మ ధ్య సిడె కదిలింది. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. పూజారి కురుమయ్య పొడువైన కర్ర, చివర న గొర్రెనుకట్టి మధ్యలో భక్తులపై బండారు (పసుపు, కుంకుమ) చల్లుతూ గుడి చుట్టూ తిప్పారు. సిడెను తాకితే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. దీంతో సిడెను తాకేందుకు పోటీపడ్డారు.
ఉ మ్మడి జిల్లాతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాలైన కర్నూల్, ప్రకాశం జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో ఆల య ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఈదమ్మ తల్లీ దీవించమ్మా అంటూ వేడుకున్నారు. బోనంకుండలో నైవేద్యాన్ని ఉంచి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశా రు. అనంతరం కోళ్లు, పొట్టేళ్లను బలిచ్చారు. నాయకులు, ప్రజాప్రతినిధులు ఈదమ్మతల్లిని దర్శించుకున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.