పాలమూరు, ఏప్రిల్ 19 : ప్రపంచాన్ని శాసించగల సత్తా ఒక్క విద్యకు మాత్రమే ఉన్నదని ప్రొఫెసర్ బి.శివారెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ ఎంవీఎస్ కళాశాలలో ‘నెప్-2020 ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చాలెంజెస్ అండ్ పాసిబులిటీస్’ అనే అంశంపై తె లంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ సహకారంతో అర్థశాస్త్ర విభాగం నుంచి బుధవా రం జాతీయ సదస్సు నిర్వహించారు. సదస్సులో ఆయా రాష్ర్టాల నుంచి 250 మంది ప్ర తినిధులు పాల్గొనగా.. 85 మందికి పరిశోధనా పత్రాల ను అందజేశారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడు తూ ఎన్ఈపీ-2020 విద్యావిధానం గురించి క్షుణ్ణంగా తెలియజేశారు.
ప్రస్తుత విద్యావిధానంలో ఉన్న లోపాల ను ఏ విధంగా అధిగమించాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అంజిరెడ్డి వివరించారు. కార్యక్రమంలో పీయూ వీసీ లక్ష్మీకాంత్రాథోడ్, ఎం.మల్లికార్జున్, శివప్రసాద్, పీయూ నుంచి వచ్చిన ఎడ్యుకేషన్ కళాశాల ప్రధానాచార్యులు డా.బషీర్అహ్మద్, ఎంవీఎస్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ శివలీల, ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ డా.విజయ్కుమార్, న్యాక్ కో ఆర్డినేటర్ డా.సత్యనారాయణగౌడ్, టీఎస్కేఈ కో ఆర్డినేటర్ డా.తిరుపతయ్య, ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ డా.హ రిప్రసాద్, డా.వెంకటయ్య, నర్సింహులు, రాఘవేంద్రరెడ్డి, నిరంజన్గౌడ్, కళాశాల ప్రిన్సిపల్ డా.పద్మావతి పాల్గొన్నారు.