కొల్లాపూర్: పేదల ఆరోగ్య భద్రతకు సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి అన్నారు. నియోజకవర్గానికి చెందిన పలువురు అనార్యోగంతో చికిత్స పొందగా వారి దవాఖాన ఖర్చుల నిమిత్తం మంజూరైన చెక్కు లను సంబంధిత లబ్ధిదారులకు ఆదివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బీరం అందజేశారు. ఈ సంద ర్భం గా ఆయన మాట్లాడుతూ సీఎం సహయనిధి ద్వారా అందించే సాయాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాల న్నా రు. ఆపద సమయాల్లో సీఎంఆర్ఎఫ్ ఆపద్భాందవుడిగా ఆదుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పట్టణానికి చెందిన లబ్ధిదారులు గంగభవాని కాలనీలో మంగమ్మకు రూ.11వేలు, జావాయిపల్లికి చెందిన కే.శివుడుకి రూ,40వేలు, పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్కు చెందిన సరితకు రూ.56,500లు, బోడబండ తండాకు చెందిన హన్మంత్కు రూ.లక్షా 50వేలు, వెంకటేశ్నాయక్కు రూ.24వేలు, ముక్కిడిగుండంకు చెందిన లక్ష్మణ్నాయక్కు రూ.8వేలు, సునీతకు రూ.17వేలు, గౌడమ్మకు రూ.12వేలు, చొప్పున మంజూరైన చెక్కులను అందజేశారు. కార్యక్రమం లో పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు తాళ్ల పరుశురాంగౌడ్, పట్టణ మాజీ ఉప సర్పంచ్ చంద్రశేఖరాచారి, పోతుల వెంకటేశ్వర్లు, సునీల్నాయక్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.