నాగర్కర్నూల్ : జిల్లాలోని అచ్చంపేట పట్టణంలో మధ్యాహ్నం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఆకస్మికంగా ఈదురు గాలులతో వర్షం కురిసింది. భారీ ఈదురు గాలులకు పట్టణంలో వివిధ కాలనీలలో కొందరి ఇండ్లపై భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. గాలులకు రేకుల ఇంటి పై కప్పులు కొట్టుకుపోయాయి. కరెంట్ స్థంభాలు నేలకొరుగడంతో విద్యుత్ సరఫరా కు అంతరాయం ఏర్పడింది. అలాగే బ్రాహ్మణపల్లిలో పిడుగుపాటుకు వెంకటయ్య అనే రైతుకు చెందిన ఎద్దు మృతి చెందింది.