బాలానగర్, జనవరి 29 : ఆహార పదార్థాలు, కూరగాయలు ఇతర సరుకులు కొనుగోలు చేసినప్పుడు కొసరు, మొగ్గు అని అడిగితే వ్యాపారులు కాస్తంత ఎక్కువ తూకం ఇచ్చేవారు. ప్రస్తుతం తక్కెడలు పోయి వాటి స్థానంలో డి జిటల్ కాంటాలు వచ్చాయి. దీంతో పక్కాగా తూకం వేస్తున్నారు. ప్రతిదీ బంగారంలా భావిస్తున్నారు. రాళ్ల కాంటాలతో హెచ్చు తగ్గులు ఉంటాయని ప్రతి ఒ క్కరికీ తెలిసిందే. కానీ ఎలక్ట్రానిక్ కాంటాల్లో కూడా వినియోగదారులను ఎక్కువ మోసం చేయవచ్చని మండలంలోని కొందరు వ్యా పారులు నిరూపిస్తున్నాయి.
సాధారణంగా ఘన పదార్థాల ను కిలోలు, గ్రాముల్లో, ద్రవ పదార్థాలను లీటర్లలో కొలుస్తారు. ఘన పదార్థాల కొనుగోలుకు వెళ్తే.. ఎలక్ట్రానిక్ ద్రవ పదార్థాల తూకం మోడ్లో ఉంచి తూకం వేస్తున్నారు. కాం టా స్క్రీన్పై ఎల్ అనే అక్షరంపై మాత్రం స్టిక్కర్ అతికిస్తున్నారు. వాస్తవానికి కిలో ఘన పదార్థం బరువు 11,000 గ్రాములు ఉండగా, ద్రవ పదార్థం బరువు 8 50 గ్రాములు మాత్రమే వస్తున్నది. దీంతో కాంటాలో ఆప్షన్ను లీటర్ మో డ్లోకి మార్చి ఘన పదార్థాల తూకం వేస్తున్నారు. దీంతో స్క్రీన్పై కనిపించేది లీటర్ల తూకంపై కొనుగోలు దారులకు కిలోలుగా చూపించి మోసం చేస్తున్నారు.
స్క్రీన్పై ఎల్ అనే అక్షరంపై కనబడకుండా స్టిక్కర్ వేయడమో..రంగు పూయడమో చేస్తున్నారు. దీంతో వినియోదదారుడు కిలోకు 100 నుంచి 150 గ్రాములు వరకు నష్టపోతున్నారు. ఆయా గ్రా మాల్లో మాత్రం, చిల్లర దుకాణాలు, చికెన్ షాపులు, కూరగాయల మార్కెట్లపై తూనికల, కొలతల శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడింది. వ్యాపారులు ఇష్టం వచ్చినట్లు తూ కాలు వేసి వినియోగదారులను దోచుకుంటున్నారు. తూకం లో తేడా ఉందని వినియోగదాలకు అనుమానం వచ్చినా ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్ని దుకాణాల్లో సీల్ లేకుండానే ఎలక్ట్రానిక్ కాంటాను వి నియోగిస్తున్నారు. మరి కొన్ని చోట్ల అరిగిపోయిన రాళ్లు, మొద్దు కాంటాలు వినియోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మోసాలు చిల్లర దుకాణాల్లో కొద్ది మేర మాత్ర మే వ్యత్యాసం వస్తుండగా చికెన్ దుకాణాల్లో మాత్రం బారీ తేడాలు ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. నామ మాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. దీం తో వ్యాపారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
మండలంలో పలు వ్యాపారాల్లో జరుగుతున్న మోసాలకు రహస్యంగా పసిగడుతున్న తూనికలు, కొలతల శాఖ అధికారులు ఎలాంటి ప్రజా ఫిర్యాదు లేకుండా వ్యాపారస్తుల నుంచి నెల వారీ మా ములు వసూలు చేస్తున్నార నే ఆరోపణలు వినిపిస్తున్నా యి. ఒక వస్తువు ఉత్పత్తి కా గానే దాని నాణ్యత బరువు ధరను కచ్చితంగా ముద్రించాలి. అయితే వస్తువు ప్ర మాణాలు బట్టి నియమ ని బంధనలు పాటించేవి సగమైతే సగానికిపైగా మార్కె ట్లో విక్రయానికి సిద్ధంగా ఉ న్న వస్తువులపై ఎలాంటి బ రువు ధర నాణ్యత వివరా లు లేకుండా మార్కెట్లో చె లామణి అవుతున్నాయి. అ లా మోసాలు జరుగుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
ప్రతి ఏటా వ్యాపారులు వాడుతున్న కాంటా తూ కం, రాళ్లను తనిఖీ చేసి అధికారులు ముద్రలు వేయాల్సి ఉంటుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మండలంలో సాగుతున్న మోసాలను అరికట్టడంతోపాటు ప్రతి మూడు నెలలకోసారి జరిగే మండల సర్వసభ్య సమావేశాలకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు హాజరవుతునట్లే తూనికల, కొలతల శాఖ అధికారులు కూడా హాజరు కావాలి. ఆ శాఖ అధికారులు ప్రజలకు తెలియకపోయిన సర్వసభ్య సమావేశాలకు హాజర య్యే ప్రజాప్రతినిధులకైనా తెలుస్తుందని కొందరు వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.
వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి
మండలంలో పలువురు దుకాణాదారులు, సంతలో కొలతలో మోసాలకు పాల్పడుతున్నారు. దుకాణాల్లో తూనికలు, కొలతలతో మోసాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి జరిమానాలు విధించాలి. షా పులు, వారాంతపు సంతలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తూనికలు, కొలతల శాఖ అధికారులు వ్యాపారులపై చర్యలు తీసుకున్నట్లు మేము ఎప్పడు కూడా చూడలేదు. సంతలో తనిఖీలు నిర్వహించి వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి.
-నర్సింగ్రావు, గ్రామస్తుడు, ఉడిత్యాల
అధికారులకు చెప్పుతాం
వినియోగదారుల్లో ప్రశ్నించేతత్వం పెరగాలి. అప్పుడే వ్యాపారుల్లో మోసపూరిత దోరణులు మారతాయి. వ స్తువు కొనుగోలు చేసే సమయంలో తూకాలను నిశ్చితం గా గమనించాలి. మోసాలకు పాల్పడతున్నట్లు అనుమానం వస్తే వెంటనే తూనికల, కొలతల శాఖ కంట్రోల్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవ చ్చు. ప్రజలు కూడా ఏదైనా వస్తువు కొనే ముందు వ్యా పారస్తులు కొలతలు సరిగా చేస్తున్నారా లేదా గమనించడం అలవాటు చేసుకోవాలి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తూనికల శాఖ అధికారులకు సమాచారం అందిస్తాము.
-జయ ప్రసాద్, ఎస్సై