అలంపూర్, మార్చి 17 : రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్ర భుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అ న్నారు. పార్టీని మరింత బలోపేతం చేసే బాధ్యతను సీఎం కేసీఆర్ నాపై ఉంచారని ఆయనన్నారు. శుక్రవారం అలంపూర్ క్షేత్రంలోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఆయన దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మ న్ శ్రీనివాసరెడ్డి, ఈవో పురేందర్కుమా ర్ అర్చకులతో కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్తాలతో సత్కరించారు.
అనంతరం పట్టణంలోని తెలంగాణ హ రిత టూరిజం హోటల్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భాన్ని పురస్కరించుకుని శక్తిమా త జోగుళాంబను దర్శించుకున్నట్లు తెలిపారు. రోబోయే రోజుల్లో రాష్ట్రం సుసంపన్నంగా, సుభిక్షంగా, పసిడి పంటలతో తులతూగాలని జగజ్జననీ మాతను వేడుకున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్లో చేరిన మొట్టమొదటి వ్యక్తిగా నాకు గుర్తింపునిచ్చి అనతికాలంలోనే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్కు, సహకా రం అందించిన మంత్రులు, ఎమ్మెల్యే లు, పార్టీ పెద్దలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ర్టాన్ని అన్ని రం గాల్లో మరింత అభివృద్ధి దిశగా సీఎం కేసీఆర్ తీసుకెళ్తున్నారని చెప్పారు. అ లంపూర్ నియోజకవర్గంతోపాటు ఉమ్మ డి జిల్లాలో గులాబీ పార్టీ బలోపేతం చే సే బాధ్యతను సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాపై ఉంచారన్నా రు.
ఉమ్మడి పాలనలో ఏండ్లుగా పెండిం గ్ ఉన్న ఆర్డీఎస్ సమస్యను తెలంగాణ ఏర్పడిన ఐదేండ్లలోనే పరిష్కరించి అవసరమైన రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. దీంతో నేడు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠమైన అలంపూర్ ఆలయాలకు సమస్య గా ఉన్న ఆర్కియాలజీ నిబంధనల విషయమై ప్రభుత్వ సహకారంతో పురావస్తు శాఖాధికారులతో మాట్లాడుతానని చెప్పారు. జోగుళాంబ దేవి పాదల నుం చి పాదయాత్ర చేసిన సీఎం కేసీఆర్కు అలంపూర్ ప్రాంతంపై అవగాహన ఉం దన్నారు. మున్సిపాలిటీలో ఏండ్లుగా పెండింగ్ ఉన్న ఇంటి స్థలాల పట్టాల పంపిణీ, డెవలప్మెంట్పై అధికారుల తో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సర్కార్ దవాఖాన అప్గ్రేడ్ కోసం మంత్రితో మాట్లాడుతానని చె ప్పారు. దవాఖానలో అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని వివరించారు. అభివృద్ధికి అందరూ కలిసి రావాలన్నారు. తుంగభద్ర నదిపై ర్యాలంపాడు-అలంపూర్ వద్ద రూ.35 కోట్లతో నిర్మించిన వంతెన ఫినిషింగ్ ప నులు పూర్తి చేయిస్తామన్నారు. వచ్చే అ సెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గె లుపు కోసం కృషి చేస్తానని పేర్కొన్నా రు. వచ్చేవన్నీ మంచిరోజులని, కేసీఆర్ సారథ్యంలో అన్నీ సవ్యంగా జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.