గద్వాల, మార్చి 14 : రాజకీయాల్లో నడిగడ్డకు ప్ర త్యేక చరిత్ర ఉందని, కాంగ్రెస్ నేతల ప్రలోభాలకు లొంగితే భవిష్యత్ ఆగమవుతుందని గద్వాల ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సూచించారు. జిల్లా కేం ద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్య ర్థి నవీన్కుమార్రెడ్డికి మద్దతుగా గురువారం స్థానిక సంస్థల ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, అలంపూ ర్ ఎమ్మెల్యే విజయుడు, అభ్యర్థి నవీన్కుమార్రెడ్డి హా జరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేద్దామన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటును నవీన్కుమార్రెడ్డికి వే యాలని సూచించారు.
ఇప్పటికే గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు మన ప్రజాప్రతినిధులను ఇబ్బందులు, ప్రలోభాలకు గురిచేస్తున్నారని.. వాటికి లొంగకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలను అమ లు చేయకుండా ప్రజలను మోసం చేసిందని.. ఆ పా ర్టీకి ఉప ఎన్నికలో తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఎమ్మె ల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు పెద్దకష్టమే మీ కాదన్నారు.
మరోసారి మన నడిగడ్డ పౌరుషం చా టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మి ఆ పార్టీ బరిలో నిలిపిన అభ్యర్థికి ఓ టు వేస్తే మనకు ఘోస తప్పదన్నారు. ఎమ్మెల్సీ అ భ్యర్థి నవీన్ మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు అవకాశమిచ్చారని, ఎమ్మెల్సీ గెలుపును ఆయనకు కానుకగా ఇద్దామన్నారు. తనకు అండగా ఉంటే.. ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, ఎంపీపీలు రాజారెడ్డి, విజయ్, ప్రతాప్గౌడ్, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.